బహ్రెయిన్ 6వ లెజిస్టేటివ్ టెర్మ్ 3వ సెషన్ ప్రారంభం..!!
- October 14, 2024
మనామా: బహ్రెయిన్ 6వ లెజిస్టేటివ్ టెర్మ్ 3వ సెషన్ ప్రారంభమైంది. ఈసా కల్చరల్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమానికి క్రౌన్ ప్రిన్స్, ప్రధానమంత్రి అయిన హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా హాజరయ్యారు. కింగ్ కు రాగానే రిప్రజెంటేటివ్స్ కౌన్సిల్ స్పీకర్ అహ్మద్ బిన్ సల్మాన్ అల్ ముసల్లం, షురా కౌన్సిల్ చైర్మన్ అలీ బిన్ సలేహ్ అల్ సలేహ్ ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సంస్థలు, చట్టాల నిర్మాణంలో తమ జాతీయ ప్రయోజనాలను పరిరక్షించాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.జాతీయ ప్రయోజనాలు గత 25 సంవత్సరాలలో బహ్రెయిన్ పురోగతిని ప్రతిబింబిస్తూ, స్థిరమైన చట్టపరమైన ఫ్రేమ్వర్క్ ప్రాముఖ్యతను వివరించారు. బహ్రెయిన్ ఎకనామిక్ విజన్ 2030పై మళ్లీ దృష్టి పెట్టాలని అధికారులను ఆయన కోరారు. 2050 కోసం ముందుకు చూసే దృక్పథం కోసం పిలుపునిచ్చారు. పౌరులందరికీ ప్రయోజనం చేకూర్చేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







