మద్యం తయారీ ఫ్యాక్టరీపై రైడ్స్.. ఆరుగురు వ్యక్తులు అరెస్ట్..!!
- October 14, 2024
కువైట్: మద్యం తయారీ గోడౌన్ పై అధికారులు దాడులు చేశారు. స్థానికంగా తయారు చేసిన 168 మద్యం సీసాలు, పెద్దమొత్తంలో నగదు, ఇతర నిషేధిత పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. కువైట్లో అన్ని రకాల నేరాలను ఎదుర్కొనేందుకు తమ ప్రయత్నాలను కొనసాగిస్తామని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆరుగురిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులకు రిఫర్ చేసినట్టు తెలిపింది. అత్యవసర హాట్లైన్ (112) లేదా డ్రగ్ కంట్రోల్ కోసం జనరల్ అడ్మినిస్ట్రేషన్ (1884141) ద్వారా ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించాలని కోరింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







