మస్క్యులోస్కెలెటల్ ఔట్ పేషెంట్లకు శుభవార్త.. యాంటీ గ్రావిటీ ట్రెడ్మిల్ ఆవిష్కరణ..!!
- October 15, 2024
దోహా: హమద్ మెడికల్ కార్పొరేషన్ కు చెందిన ఖతార్ పునరావాస సంస్థ (QRI) విప్లవాత్మక యాంటీ గ్రావిటీ ట్రెడ్మిల్ ను ప్రవేశపెట్టింది. ప్రత్యేకంగా దానిని మస్క్యులోస్కెలెటల్ ఔట్ పేషెంట్ విభాగంలో ఏర్పాటు చేశారు. ఇది నడవలేని రోగులకు రికవరీ ప్రక్రియను మెరుగుపరుస్తుందని HMCలోని కార్పొరేట్ రీహాబిలిటేషన్ థెరపీ సర్వీసెస్ లీడ్ డాక్టర్ హనాది అల్ హమద్ తెలిపారు. కీళ్ళు , కండరాలపై ఒత్తిడి లేకుండా ఇది చేస్తుందని, తీవ్రమైన గాయాలు, శస్త్రచికిత్సల నుండి కోలుకుంటున్న వ్యక్తులకు ఇది చాలా కీలకమైనదిగా పేర్కొన్నారు. యాంటీ గ్రావిటీ ట్రెడ్మిల్ అధునాతన డిఫరెన్షియల్ ఎయిర్ ప్రెజర్ టెక్నాలజీని ఉపయోగించి, వాకింగ్ లేదా రన్నింగ్ సమయంలో రోగులకు మద్దతిచ్చే శరీర బరువు మొత్తాన్ని అడ్జస్ట్ చేసేలా రూపొందించారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







