మస్క్యులోస్కెలెటల్ ఔట్ పేషెంట్లకు శుభవార్త.. యాంటీ గ్రావిటీ ట్రెడ్మిల్ ఆవిష్కరణ..!!
- October 15, 2024
దోహా: హమద్ మెడికల్ కార్పొరేషన్ కు చెందిన ఖతార్ పునరావాస సంస్థ (QRI) విప్లవాత్మక యాంటీ గ్రావిటీ ట్రెడ్మిల్ ను ప్రవేశపెట్టింది. ప్రత్యేకంగా దానిని మస్క్యులోస్కెలెటల్ ఔట్ పేషెంట్ విభాగంలో ఏర్పాటు చేశారు. ఇది నడవలేని రోగులకు రికవరీ ప్రక్రియను మెరుగుపరుస్తుందని HMCలోని కార్పొరేట్ రీహాబిలిటేషన్ థెరపీ సర్వీసెస్ లీడ్ డాక్టర్ హనాది అల్ హమద్ తెలిపారు. కీళ్ళు , కండరాలపై ఒత్తిడి లేకుండా ఇది చేస్తుందని, తీవ్రమైన గాయాలు, శస్త్రచికిత్సల నుండి కోలుకుంటున్న వ్యక్తులకు ఇది చాలా కీలకమైనదిగా పేర్కొన్నారు. యాంటీ గ్రావిటీ ట్రెడ్మిల్ అధునాతన డిఫరెన్షియల్ ఎయిర్ ప్రెజర్ టెక్నాలజీని ఉపయోగించి, వాకింగ్ లేదా రన్నింగ్ సమయంలో రోగులకు మద్దతిచ్చే శరీర బరువు మొత్తాన్ని అడ్జస్ట్ చేసేలా రూపొందించారు.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







