హవల్లిలో స్పెషల్ తనిఖీలు..కార్లు సీజ్..నోటీసులు జారీ..!!
- October 16, 2024
కువైట్: హవల్లి గవర్నరేట్ మున్సిపాలిటీ అధికారులు స్పెషల్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా భద్రతా ఉల్లంఘనలను నమోదు చేశారు. చట్టాలను ఉల్లంఘించిన 395 మందికి నోటీసులు జారీ చేశారు. ఇందులో 270 సాధారణ పరిశుభ్రత ఉల్లంఘనలు, 100 రోడ్డు ఆక్రమణ ఉల్లంఘనలు, 15 ఆహార క్వాలిటీ,10 మంది వీధి వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు. అదే సమయంలో 61 స్క్రాప్ కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ అధికారులు మాట్లాడుతూ.. ఎలాంటి ఉల్లంఘనలు, ఆక్రమణలకు పాల్పడినా సహించేది లేదన్నారు. చట్టాలు, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







