డిజిటల్ సహకారం.. ఇండియాతో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- October 17, 2024
రియాద్: సౌదీ అరేబియా-ఇండియా మధ్య డిజిటల్ సహకారం మరింత బలోపేతం కానుంది. ఇందులో భాగంగా భారతదేశ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (TRAI)తో సౌదీ అరేబియా కమ్యూనికేషన్స్, స్పేస్ అండ్ టెక్నాలజీ కమిషన్ (CST) కీలక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పంద పత్రాలపై ట్రాయ్ చైర్మన్ అనిల్ కుమార్ లహోటీ, కమిషన్ గవర్నర్ డాక్టర్ మహమ్మద్ అల్తమీమి సంతకాలు చేశారు. న్యూఢిల్లీలో జరిగిన వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ (డబ్ల్యూటీఎస్ఏ) సందర్భంగా ఎంఓయూపై సంతకాలు చేశారు. భారతదేశ సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. రెగ్యులేటరీ టెక్నాలజీ (రెగ్టెక్) అప్లికేషన్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు డిజిటల్ రెగ్యులేషన్ పై ఉమ్మడిగా రీసెర్చ్ చేయనున్నారు. అలాగే డిజిటల్ రెగ్యులేషన్స్ అకాడమీ (DRA) అందించే శిక్షణా కార్యక్రమాల నుండి సౌదీ ప్రయోజనం పొందనుంది. వీటితోపాటు కమ్యూనికేషన్స్, స్పేస్, టెక్నాలజీలో సహకారాన్ని అందించనున్నారు.
తాజా వార్తలు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స