డిజిటల్ సహకారం.. ఇండియాతో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- October 17, 2024
రియాద్: సౌదీ అరేబియా-ఇండియా మధ్య డిజిటల్ సహకారం మరింత బలోపేతం కానుంది. ఇందులో భాగంగా భారతదేశ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (TRAI)తో సౌదీ అరేబియా కమ్యూనికేషన్స్, స్పేస్ అండ్ టెక్నాలజీ కమిషన్ (CST) కీలక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పంద పత్రాలపై ట్రాయ్ చైర్మన్ అనిల్ కుమార్ లహోటీ, కమిషన్ గవర్నర్ డాక్టర్ మహమ్మద్ అల్తమీమి సంతకాలు చేశారు. న్యూఢిల్లీలో జరిగిన వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ (డబ్ల్యూటీఎస్ఏ) సందర్భంగా ఎంఓయూపై సంతకాలు చేశారు. భారతదేశ సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. రెగ్యులేటరీ టెక్నాలజీ (రెగ్టెక్) అప్లికేషన్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు డిజిటల్ రెగ్యులేషన్ పై ఉమ్మడిగా రీసెర్చ్ చేయనున్నారు. అలాగే డిజిటల్ రెగ్యులేషన్స్ అకాడమీ (DRA) అందించే శిక్షణా కార్యక్రమాల నుండి సౌదీ ప్రయోజనం పొందనుంది. వీటితోపాటు కమ్యూనికేషన్స్, స్పేస్, టెక్నాలజీలో సహకారాన్ని అందించనున్నారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









