వెదురు బొంగుతో డ్రోన్ తయారు చేసిన మెకానికల్ ఇంజినీర్
- October 20, 2024
బెంగళూరు: "కాదేది కవితకు అనర్హం" అంటూ మన ప్రముఖ తెలుగు కవి శ్రీశ్రీ రాసిన "మహాప్రస్థానం" లోని ఈ వాక్యం కవిత్వానికి అనర్హమైనది ఏదీ లేదు అని సూచిస్తుంది. అలాగే “పట్టుదల ఉంటే కూడా ఏదైనా సాధించొచ్చు” అని నిరూపించాడు బెంగళూరుకు చెందిన ఓ మెకానికల్ ఇంజినీర్. ప్రొడక్ట్ డిజైనర్ అయిన దీపక్ దధీచ్ తాజాగా ఇతను వెదురు బొంగుతో డ్రోన్ తయారు చేసి సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు.
బెంగళూరుకు చెందిన మెకానికల్ ఇంజినీర్ మరియు ప్రొడక్ట్ డిజైనర్ దీపక్ దధీచ్ వెదురు బొంగుతో డ్రోన్ తయారు చేశారు. దీపక్ తన ఇంజినీరింగ్ నైపుణ్యాలను ఉపయోగించి, పర్యావరణ హితమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన డ్రోన్ను రూపొందించారు. ఈ డ్రోన్ తయారీలో ప్రధానంగా వెదురు బొంగును ఉపయోగించి తక్కువ బరువుతో కూడిన బలమైన నిర్మాణంతో డ్రోన్ ని తయారు చేశాడు.
ఈ డ్రోన్ను ముఖ్యంగా వ్యవసాయం, పర్యావరణ పరిశీలన మరియు చిన్న సరుకుల రవాణా వంటి రంగాల్లో వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు అని భావిస్తున్నారు. తన సృజనాత్మకతను మరియు ఇంజినీరింగ్ నైపుణ్యాలను ఉపయోగించి, ఒక వినూత్నమైన పరికరాన్ని తయారు చేసిన దీపక్ ను తన సహచరులు ఎంతగానో అభినందించారు.
--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









