వెదురు బొంగుతో డ్రోన్ తయారు చేసిన మెకానికల్ ఇంజినీర్
- October 20, 2024
బెంగళూరు: "కాదేది కవితకు అనర్హం" అంటూ మన ప్రముఖ తెలుగు కవి శ్రీశ్రీ రాసిన "మహాప్రస్థానం" లోని ఈ వాక్యం కవిత్వానికి అనర్హమైనది ఏదీ లేదు అని సూచిస్తుంది. అలాగే “పట్టుదల ఉంటే కూడా ఏదైనా సాధించొచ్చు” అని నిరూపించాడు బెంగళూరుకు చెందిన ఓ మెకానికల్ ఇంజినీర్. ప్రొడక్ట్ డిజైనర్ అయిన దీపక్ దధీచ్ తాజాగా ఇతను వెదురు బొంగుతో డ్రోన్ తయారు చేసి సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు.
బెంగళూరుకు చెందిన మెకానికల్ ఇంజినీర్ మరియు ప్రొడక్ట్ డిజైనర్ దీపక్ దధీచ్ వెదురు బొంగుతో డ్రోన్ తయారు చేశారు. దీపక్ తన ఇంజినీరింగ్ నైపుణ్యాలను ఉపయోగించి, పర్యావరణ హితమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన డ్రోన్ను రూపొందించారు. ఈ డ్రోన్ తయారీలో ప్రధానంగా వెదురు బొంగును ఉపయోగించి తక్కువ బరువుతో కూడిన బలమైన నిర్మాణంతో డ్రోన్ ని తయారు చేశాడు.
ఈ డ్రోన్ను ముఖ్యంగా వ్యవసాయం, పర్యావరణ పరిశీలన మరియు చిన్న సరుకుల రవాణా వంటి రంగాల్లో వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు అని భావిస్తున్నారు. తన సృజనాత్మకతను మరియు ఇంజినీరింగ్ నైపుణ్యాలను ఉపయోగించి, ఒక వినూత్నమైన పరికరాన్ని తయారు చేసిన దీపక్ ను తన సహచరులు ఎంతగానో అభినందించారు.
--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







