వెదురు బొంగుతో డ్రోన్ తయారు చేసిన మెకానికల్ ఇంజినీర్
- October 20, 2024
బెంగళూరు: "కాదేది కవితకు అనర్హం" అంటూ మన ప్రముఖ తెలుగు కవి శ్రీశ్రీ రాసిన "మహాప్రస్థానం" లోని ఈ వాక్యం కవిత్వానికి అనర్హమైనది ఏదీ లేదు అని సూచిస్తుంది. అలాగే “పట్టుదల ఉంటే కూడా ఏదైనా సాధించొచ్చు” అని నిరూపించాడు బెంగళూరుకు చెందిన ఓ మెకానికల్ ఇంజినీర్. ప్రొడక్ట్ డిజైనర్ అయిన దీపక్ దధీచ్ తాజాగా ఇతను వెదురు బొంగుతో డ్రోన్ తయారు చేసి సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు.
బెంగళూరుకు చెందిన మెకానికల్ ఇంజినీర్ మరియు ప్రొడక్ట్ డిజైనర్ దీపక్ దధీచ్ వెదురు బొంగుతో డ్రోన్ తయారు చేశారు. దీపక్ తన ఇంజినీరింగ్ నైపుణ్యాలను ఉపయోగించి, పర్యావరణ హితమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన డ్రోన్ను రూపొందించారు. ఈ డ్రోన్ తయారీలో ప్రధానంగా వెదురు బొంగును ఉపయోగించి తక్కువ బరువుతో కూడిన బలమైన నిర్మాణంతో డ్రోన్ ని తయారు చేశాడు.
ఈ డ్రోన్ను ముఖ్యంగా వ్యవసాయం, పర్యావరణ పరిశీలన మరియు చిన్న సరుకుల రవాణా వంటి రంగాల్లో వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు అని భావిస్తున్నారు. తన సృజనాత్మకతను మరియు ఇంజినీరింగ్ నైపుణ్యాలను ఉపయోగించి, ఒక వినూత్నమైన పరికరాన్ని తయారు చేసిన దీపక్ ను తన సహచరులు ఎంతగానో అభినందించారు.
--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- పర్యాటకులకు ఇష్టమైన ఈద్ విహార కేంద్రంగా ఒమన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!









