ఎనిమిది వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి
- October 20, 2024
బెంగళూరు: బెంగళూరులో జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో టీమిండియాను న్యూజిలాండ్ క్రికెట్ జట్టు 8 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ విజయంతో న్యూజిలాండ్ 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై టెస్టు మ్యాచ్ గెలిచింది. మ్యాచ్ ప్రారంభంలోనే భారత బ్యాటర్లు తేలిపోవడంతో, తొలి ఇన్నింగ్స్లో కేవలం 46 పరుగులకే కుప్పకూలిపోయారు. న్యూజిలాండ్ బౌలర్లు అద్భుతంగా రాణించి, భారత బ్యాటర్లను కట్టడి చేశారు. ముఖ్యంగా మాట్ హెన్రీ 5 వికెట్లు పడగొట్టగా, ఓ రూర్క్ 4 వికెట్లు తీశాడు.
తదుపరి, న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 492 పరుగులు చేసి, 356 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. ఈ ఇన్నింగ్స్లో రచిన్ రవీంద్ర 134 పరుగులతో మెరిశాడు.
భారత రెండో ఇన్నింగ్స్లో సర్ఫరాజ్ ఖాన్ 150 పరుగులు చేసి, పంత్ 99 పరుగులతో రాణించారు. కానీ, 462 పరుగులు చేసినా, న్యూజిలాండ్ ముందు 107 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగారు. న్యూజిలాండ్ ఈ లక్ష్యాన్ని కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విల్ యంగ్ 48 పరుగులు, రచిన్ రవీంద్ర 39 పరుగులతో నాటౌట్గా నిలిచారు. ఈ విజయంతో న్యూజిలాండ్ మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్టు అక్టోబర్ 24న పుణె వేదికగా జరగనుంది.
తాజా వార్తలు
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- పర్యాటకులకు ఇష్టమైన ఈద్ విహార కేంద్రంగా ఒమన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం









