ఎనిమిది వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి
- October 20, 2024
బెంగళూరు: బెంగళూరులో జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో టీమిండియాను న్యూజిలాండ్ క్రికెట్ జట్టు 8 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ విజయంతో న్యూజిలాండ్ 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై టెస్టు మ్యాచ్ గెలిచింది. మ్యాచ్ ప్రారంభంలోనే భారత బ్యాటర్లు తేలిపోవడంతో, తొలి ఇన్నింగ్స్లో కేవలం 46 పరుగులకే కుప్పకూలిపోయారు. న్యూజిలాండ్ బౌలర్లు అద్భుతంగా రాణించి, భారత బ్యాటర్లను కట్టడి చేశారు. ముఖ్యంగా మాట్ హెన్రీ 5 వికెట్లు పడగొట్టగా, ఓ రూర్క్ 4 వికెట్లు తీశాడు.
తదుపరి, న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 492 పరుగులు చేసి, 356 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. ఈ ఇన్నింగ్స్లో రచిన్ రవీంద్ర 134 పరుగులతో మెరిశాడు.
భారత రెండో ఇన్నింగ్స్లో సర్ఫరాజ్ ఖాన్ 150 పరుగులు చేసి, పంత్ 99 పరుగులతో రాణించారు. కానీ, 462 పరుగులు చేసినా, న్యూజిలాండ్ ముందు 107 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగారు. న్యూజిలాండ్ ఈ లక్ష్యాన్ని కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విల్ యంగ్ 48 పరుగులు, రచిన్ రవీంద్ర 39 పరుగులతో నాటౌట్గా నిలిచారు. ఈ విజయంతో న్యూజిలాండ్ మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్టు అక్టోబర్ 24న పుణె వేదికగా జరగనుంది.
తాజా వార్తలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..







