ఏపీలో దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ
- October 20, 2024
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో దీపావళి పండుగ నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభమవుతుందనీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కేబినెట్ సమావేశంలో ఈ పథకానికి ఆమోదం తెలుపుతామని ప్రకటించిన ఆయన ఈ పథకం కింద, ప్రతి సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని తెలిపారు.ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కట్టుబడి ఉందని, పారదర్శక పాలన అందించడంలో ప్రభుత్వం ముందుంటుందని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు.
నాదెండ్ల మనోహర్ ఈ వ్యాఖ్యలు ఇటీవల జరిగిన ఒక ప్రెస్ మీట్లో చేశారు. ఈ పథకం ద్వారా ప్రజలకు మరింత సౌకర్యం కల్పించడమే లక్ష్యమని ఆయన వివరించారు. ఈ పథకం వల్ల ప్రజలకు ఆర్థిక భారం తగ్గుతుందని, ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







