ఏపీలో దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ
- October 20, 2024
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో దీపావళి పండుగ నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభమవుతుందనీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కేబినెట్ సమావేశంలో ఈ పథకానికి ఆమోదం తెలుపుతామని ప్రకటించిన ఆయన ఈ పథకం కింద, ప్రతి సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని తెలిపారు.ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కట్టుబడి ఉందని, పారదర్శక పాలన అందించడంలో ప్రభుత్వం ముందుంటుందని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు.
నాదెండ్ల మనోహర్ ఈ వ్యాఖ్యలు ఇటీవల జరిగిన ఒక ప్రెస్ మీట్లో చేశారు. ఈ పథకం ద్వారా ప్రజలకు మరింత సౌకర్యం కల్పించడమే లక్ష్యమని ఆయన వివరించారు. ఈ పథకం వల్ల ప్రజలకు ఆర్థిక భారం తగ్గుతుందని, ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







