ఏపీలో దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ
- October 20, 2024
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో దీపావళి పండుగ నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభమవుతుందనీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కేబినెట్ సమావేశంలో ఈ పథకానికి ఆమోదం తెలుపుతామని ప్రకటించిన ఆయన ఈ పథకం కింద, ప్రతి సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని తెలిపారు.ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కట్టుబడి ఉందని, పారదర్శక పాలన అందించడంలో ప్రభుత్వం ముందుంటుందని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు.
నాదెండ్ల మనోహర్ ఈ వ్యాఖ్యలు ఇటీవల జరిగిన ఒక ప్రెస్ మీట్లో చేశారు. ఈ పథకం ద్వారా ప్రజలకు మరింత సౌకర్యం కల్పించడమే లక్ష్యమని ఆయన వివరించారు. ఈ పథకం వల్ల ప్రజలకు ఆర్థిక భారం తగ్గుతుందని, ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం!
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- పర్యాటకులకు ఇష్టమైన ఈద్ విహార కేంద్రంగా ఒమన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!









