క్షమాభిక్ష కాలవ్యవధికి స్పందించని వలస కార్మికులు
- July 07, 2015
ఒమాన్ లో అక్రమ వలస కార్మికుల కోసం ఇవ్వబడిన 3 నెలల క్షమాభిక్ష కాల వ్యవధి ఈనెల 31న ముగియనున్న నేపధ్యంలో, ఆశించినదానిలో కనీసం 5 వ వంతు కన్నా తక్కువమంది స్పందించడం, నిరాశాజనకం. ఈ దేశంలో 50,000 మంది అనధికారికంగా లేదా కాంట్రాక్టు వ్యవధి దాటిన కార్మికులున్నప్పటికీ, కేవలం 8000 మంది మాత్రమే ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఒమాన్లో ఉన్న నాలుగు ముఖ్య ఏషియా దేశాల రాయబార కార్యాలయ లెక్కల ప్రకారం, 8334 మంది ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారని తెలిసింది. మొత్తం మీద 4000 మంది దేశాన్ని వదిలి వెళ్లారనీ, 12000 మంది రిజిస్టర్ చేయించుకున్నారని తెలియ వచ్చింది. ఈవిధమైన క్షమాభిక్ష వ్యవధి కార్యక్రమాన్ని ప్రభుత్వం గతంలో 2005 నుండి 2010 వరకు కూడా చేపట్టిందని, అప్పట్లో సుమారు 60,000 మంది వలస కార్మికులు, ముఖ్యంగా ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ నుండి తమ స్వదేశాలకు వెళ్లారని అధికారులు తెల్పారు. ఈసారి ఇప్పటివరకు 1700 మంది భారతీయులు, 2500 మంది పాకిస్తానీయులు, 134 మంది ఫిలిపేన్స్ వారు ఈ అవకాశాన్ని వినియొఈగించుకున్నట్టు గణాంకాలు చెపుతున్నాయి.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









