క్షమాభిక్ష కాలవ్యవధికి స్పందించని వలస కార్మికులు

- July 07, 2015 , by Maagulf
క్షమాభిక్ష కాలవ్యవధికి స్పందించని వలస కార్మికులు

 

ఒమాన్ లో అక్రమ వలస కార్మికుల కోసం ఇవ్వబడిన 3 నెలల క్షమాభిక్ష కాల వ్యవధి ఈనెల 31న ముగియనున్న నేపధ్యంలో, ఆశించినదానిలో కనీసం 5 వ వంతు కన్నా తక్కువమంది స్పందించడం, నిరాశాజనకం. ఈ దేశంలో 50,000 మంది అనధికారికంగా లేదా కాంట్రాక్టు వ్యవధి దాటిన కార్మికులున్నప్పటికీ, కేవలం 8000 మంది మాత్రమే ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఒమాన్‌లో ఉన్న నాలుగు ముఖ్య ఏషియా దేశాల రాయబార కార్యాలయ లెక్కల ప్రకారం, 8334 మంది ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారని తెలిసింది. మొత్తం మీద 4000 మంది దేశాన్ని వదిలి వెళ్లారనీ, 12000 మంది రిజిస్టర్ చేయించుకున్నారని తెలియ వచ్చింది. ఈవిధమైన క్షమాభిక్ష వ్యవధి కార్యక్రమాన్ని ప్రభుత్వం గతంలో 2005 నుండి 2010 వరకు కూడా చేపట్టిందని, అప్పట్లో సుమారు 60,000 మంది వలస కార్మికులు, ముఖ్యంగా ఇండియా, బంగ్లాదేశ్,  పాకిస్థాన్ నుండి తమ స్వదేశాలకు వెళ్లారని అధికారులు తెల్పారు. ఈసారి ఇప్పటివరకు 1700 మంది భారతీయులు, 2500 మంది పాకిస్తానీయులు, 134 మంది ఫిలిపేన్స్ వారు ఈ అవకాశాన్ని వినియొఈగించుకున్నట్టు గణాంకాలు చెపుతున్నాయి.

 

--నూనె లెనిన్ కుమార్(ఒమాన్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com