బహ్రెయిన్ లోని గ్రాండ్ మాస్క్ లో రోజూ 400 మందికి ఇఫ్తార్ విందు
- July 07, 2015
బహ్రెయిన్ లోనే అతిపెద్డదైన జూఫ్ఫైర్ లోని అహ్మద్ అల్ ఫతే ఇస్లామిక్ సెంటర్ (గ్రాండ్ మాస్క్)లో రమదాన్ నెలలో ప్రతిరోజూ 400 మంది ఇఫ్తార్ విందుభోజనం చేస్తున్నారు. 2000 సంవత్సరం నుండి ఒక అజ్ఞాత ధార్మికుడు ప్రతి సంవత్సరం ఇస్తున్న ఈ విందులో ముస్లిములు, ముస్లిమేతరులు కూడా పాల్గొంటున్నారని, ఇంచుమించు 4000 బహ్రెయిన్ దీనర్లు ఖర్చయ్యే ఈ విందులో ఖర్జూరాలు, బియ్యం-మాంసం కలిపి వందే ఘౌజీ, నీరు, లాబాన్ మరియు పండ్ల రసం సరఫరా చేస్తామని, ఇందుకయే ఖర్చు ఆ అజ్ఞాత భక్తుడే భరిస్తున్నారని, ఆయన కోరిక మేరకు వివరాలు గోప్యంగా ఉంచుతున్నామని మసీదు సుపర్వైజర్ అబ్దుల్ రహమాన్ బుఖమ్మల్ తెలిపారు. ఈ మసీదులో సేవలందించేందుకు వాలెంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఇంజనీర్ శ్రీ బుఖమ్మల్, 20 సంవత్సరాల క్రితం మెట్టమొదట ఈ విందును ఏర్పాటు చేసినపుడు కేవలం 5గురు మాత్రమే హాజరవడాన్ని గుర్తుచేసుకున్నారు. ఇక్కడి రీతి రివాజులు తెలుసుకోగోరే విదేశీయులను, ముఖ్యంగా అమెరికా నేవీ ఉద్యోగులను ఆహ్వానిస్తామని, కాగా వారికి క్రింద కూర్చొని, కుడిచేతితో, ఒకే ప్లేటులో మిగిలిన 5 గురితో కలసి తినవలసినదిగా సూచిస్తామని, పవిత్ర ఖురాన్ లో కూడా ఇదేవిధంగా చెప్పబడిందని ఆయన తెలిపారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







