సౌదీ అరేబియాలో రైల్వే చట్టం బలోపేతం..ఇక SR10 మిలియన్ల వరకు జరిమానా..!!
- October 21, 2024
జెడ్డా: సౌదీ అరేబియాలో రైల్వే చట్టాలను బలోపేతం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి గరిష్టంగా SR10 మిలియన్ల జరిమానా విధించనున్నట్లు ప్రకటించారు. బడుతుంది. ఉల్లంఘన పునరావృతమైతే SR20 మిలియన్ల జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు.ఈ మేరకు రైల్వే చట్టం, దాని కార్యనిర్వాహక నిబంధనల ఉల్లంఘనలను సమీక్షించే కమిటీ ప్రకటించింది.రైల్వేల కార్యక్రమాలను అడ్డుకునేలా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైల్వే ప్రాంగణాల్లో వాహనాలు, సామగ్రిని వదిలేయడం, జంతువులను వదిలివేయడం, రైల్వే రక్షణ కంచెలను దాటడం, తాత్కాలిక లేదా శాశ్వత నిర్మాణాలను నిర్మించడం వంటి అనేక ఉల్లంఘనలకు తీవ్రమైన శిక్షలు ఉంటాయని వెల్లడించింది. రైల్వే ట్రాక్, ప్రాంగణాల్లో నిబంధనలను కచ్చితంగా పాటించాలని కోరారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









