బహ్రెయిన్ రోడ్లపై ఇ-స్కూటర్ బూమ్.. రైడ్స్ పై ఆందోళన..!!
- October 21, 2024
మనామా: బహ్రెయిన్ రోడ్లపై ఎలక్ట్రిక్ స్కూటర్లు లేదా ఇ-స్కూటర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జుఫైర్, మనామా, తుబ్లీ, ముహర్రాక్ వంటి ప్రాంతాల్లో ఇ-స్కూటర్ రైడ్స్ సాధారణంగా మారాయి. ముఖ్యంగా సాయంత్రం సమయంలో చాలా మంది నివాసితులు వాటిపైనే రైడ్స్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో నాణ్యత,బ్రాండ్ ను బట్టి ఇ-స్కూటర్ల ధరలు BD100 నుండి BD300 వరకు ఉన్నాయి. ఇ-స్కూటర్ల వినియోగం పర్యావరణ అనుకూలమైన రవాణా విధానాన్ని అందిస్తున్నప్పటికీ, పెరుగుతున్న రైడర్ల సంఖ్య రోడ్డు భద్రత, పాదచారుల నడక మార్గాలపై ఇ-స్కూటర్ల రైడ్స్ ఆందోళన కలిగిస్తున్నాయని బహ్రెయిన్ ఎలక్ట్రిక్ స్కూటర్ టీమ్ స్థాపకుడు జెరెమీ క్లావెరో తెలిపారు. ఇ-స్కూటర్ల కోసం ప్రత్యేక లేన్ల ఏర్పాటు అవసరమని అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న జనాదరణ నేపథ్యంలో బహ్రెయిన్లో ఇ-స్కూటర్ల కోసం యూరోపియన్ తరహా నిబంధనలను అనుసరించాలని సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









