బహ్రెయిన్ రోడ్లపై ఇ-స్కూటర్ బూమ్.. రైడ్స్ పై ఆందోళన..!!
- October 21, 2024
మనామా: బహ్రెయిన్ రోడ్లపై ఎలక్ట్రిక్ స్కూటర్లు లేదా ఇ-స్కూటర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జుఫైర్, మనామా, తుబ్లీ, ముహర్రాక్ వంటి ప్రాంతాల్లో ఇ-స్కూటర్ రైడ్స్ సాధారణంగా మారాయి. ముఖ్యంగా సాయంత్రం సమయంలో చాలా మంది నివాసితులు వాటిపైనే రైడ్స్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో నాణ్యత,బ్రాండ్ ను బట్టి ఇ-స్కూటర్ల ధరలు BD100 నుండి BD300 వరకు ఉన్నాయి. ఇ-స్కూటర్ల వినియోగం పర్యావరణ అనుకూలమైన రవాణా విధానాన్ని అందిస్తున్నప్పటికీ, పెరుగుతున్న రైడర్ల సంఖ్య రోడ్డు భద్రత, పాదచారుల నడక మార్గాలపై ఇ-స్కూటర్ల రైడ్స్ ఆందోళన కలిగిస్తున్నాయని బహ్రెయిన్ ఎలక్ట్రిక్ స్కూటర్ టీమ్ స్థాపకుడు జెరెమీ క్లావెరో తెలిపారు. ఇ-స్కూటర్ల కోసం ప్రత్యేక లేన్ల ఏర్పాటు అవసరమని అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న జనాదరణ నేపథ్యంలో బహ్రెయిన్లో ఇ-స్కూటర్ల కోసం యూరోపియన్ తరహా నిబంధనలను అనుసరించాలని సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..







