ప్రముఖ రిటైలర్ లులూ ఐపీఓ.. నవంబర్ 14న లిస్టింగ్..25శాతం వాటా విక్రయం..!!
- October 21, 2024
యూఏఈ: యూఏఈ ప్రముఖ రిటైలర్ లులూ గ్రూప్ 25 శాతం షేర్లను ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO) ద్వారా విక్రయించనుంది. ఒక్కో షేర్ విలువ Dh0.051గా ప్రకటించింది. కంపెనీ ప్రాస్పెక్టస్ ప్రకారం.. కంపెనీ మూడు-విడతల IPO ద్వారా 2.582 బిలియన్ల (2,582,226,338) షేర్లను విక్రయించనుంది. ఇది అక్టోబర్ 28న ప్రారంభమై నవంబర్ 5న ముగుస్తుంది. లులూ రిటైల్ హోల్డింగ్ అబుదాబి సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్లో జాబితా కానుంది. లిస్టింగ్ నవంబర్ 14న ఉంటుందని భావిస్తున్నారు. అక్టోబర్ 28న ఆఫర్ ధరను ప్రకటించనుంది. లులూ షేర్ విక్రయానికి వచ్చే వారం ఇన్వెస్టర్ల నుంచి అద్భుతమైన స్పందన వస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యూఏఈతోపాటు GCC ప్రాంతంలో 50వేల మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న అతిపెద్ద రిటైలర్లలో లులూ గ్రూప్ ఒకటి. రాబోయే ఐదేళ్లలో GCC దేశాల్లో మరింత విస్తరిస్తామని లులు రిటైల్ CEO సైఫీ రూపవాలా తెలిపారు.
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!