ప్రముఖ రిటైలర్ లులూ ఐపీఓ.. నవంబర్ 14న లిస్టింగ్..25శాతం వాటా విక్రయం..!!
- October 21, 2024
యూఏఈ: యూఏఈ ప్రముఖ రిటైలర్ లులూ గ్రూప్ 25 శాతం షేర్లను ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO) ద్వారా విక్రయించనుంది. ఒక్కో షేర్ విలువ Dh0.051గా ప్రకటించింది. కంపెనీ ప్రాస్పెక్టస్ ప్రకారం.. కంపెనీ మూడు-విడతల IPO ద్వారా 2.582 బిలియన్ల (2,582,226,338) షేర్లను విక్రయించనుంది. ఇది అక్టోబర్ 28న ప్రారంభమై నవంబర్ 5న ముగుస్తుంది. లులూ రిటైల్ హోల్డింగ్ అబుదాబి సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్లో జాబితా కానుంది. లిస్టింగ్ నవంబర్ 14న ఉంటుందని భావిస్తున్నారు. అక్టోబర్ 28న ఆఫర్ ధరను ప్రకటించనుంది. లులూ షేర్ విక్రయానికి వచ్చే వారం ఇన్వెస్టర్ల నుంచి అద్భుతమైన స్పందన వస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యూఏఈతోపాటు GCC ప్రాంతంలో 50వేల మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న అతిపెద్ద రిటైలర్లలో లులూ గ్రూప్ ఒకటి. రాబోయే ఐదేళ్లలో GCC దేశాల్లో మరింత విస్తరిస్తామని లులు రిటైల్ CEO సైఫీ రూపవాలా తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







