ప్రముఖ రిటైలర్ లులూ ఐపీఓ.. నవంబర్ 14న లిస్టింగ్..25శాతం వాటా విక్రయం..!!
- October 21, 2024
యూఏఈ: యూఏఈ ప్రముఖ రిటైలర్ లులూ గ్రూప్ 25 శాతం షేర్లను ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO) ద్వారా విక్రయించనుంది. ఒక్కో షేర్ విలువ Dh0.051గా ప్రకటించింది. కంపెనీ ప్రాస్పెక్టస్ ప్రకారం.. కంపెనీ మూడు-విడతల IPO ద్వారా 2.582 బిలియన్ల (2,582,226,338) షేర్లను విక్రయించనుంది. ఇది అక్టోబర్ 28న ప్రారంభమై నవంబర్ 5న ముగుస్తుంది. లులూ రిటైల్ హోల్డింగ్ అబుదాబి సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్లో జాబితా కానుంది. లిస్టింగ్ నవంబర్ 14న ఉంటుందని భావిస్తున్నారు. అక్టోబర్ 28న ఆఫర్ ధరను ప్రకటించనుంది. లులూ షేర్ విక్రయానికి వచ్చే వారం ఇన్వెస్టర్ల నుంచి అద్భుతమైన స్పందన వస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యూఏఈతోపాటు GCC ప్రాంతంలో 50వేల మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న అతిపెద్ద రిటైలర్లలో లులూ గ్రూప్ ఒకటి. రాబోయే ఐదేళ్లలో GCC దేశాల్లో మరింత విస్తరిస్తామని లులు రిటైల్ CEO సైఫీ రూపవాలా తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







