దక్షిణ కోరియాలో పర్యటిస్తున్న తెలంగాణ మంత్రులు..నగరాలను పరిశీలించిన మంత్రుల బృందం
- October 23, 2024
హైదరాబాద్: దక్షిణ కోరియాలోని ఇంచియాన్ నగరంలో భాగమైన చియోంగ్న, సాంగడో, యోంగ్ జాంగ్ స్మార్ట్ సిటీలను తెలంగాణ మంత్రుల బృందం నేడు సందర్శించింది. అక్కడ ఉన్న ప్రజా సౌకర్యాలు, అందుతున్న సేవల గురించి వివరాలను అధికారులను అడిగి తెలుకున్నారు. ప్రజా రవాణా, తాగు నీటి సరఫరా, గార్బేజ్ సమస్యలు , డంపింగ్ యార్డ్ ల పరిస్థితులపై ఈ బృందం ఈ మూడు నగరాలలో అధ్యయనం చేసింది.
మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, కాలే యాదయ్య, ప్రకాశ్ గౌడ్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అధికారులు ఈ పర్యటన టీమ్ లో ఉన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…. దక్షిణ కొరియా ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం కోసం 2003లో ఇంచియాన్ ఫ్రీ ఎకనామిక్ జోన్ స్థాపించారని చెప్పారు. ఫైనాన్స్ టూరిజం వ్యాపారం కోసం ఒక ఐటీబీటీ హబ్ ను నాలెడ్జ్, సర్వీస్ ఇండస్ట్రీని స్థాపించారని ఇది లాజిస్టిక్స్ మరియు టూరిజం పై దృష్టి సారిస్తుందని తెలిపారు. ఇక్కడ తాము సేకరించిన అభిప్రాయాలతో మూసీ సుందరీకరణ చేపడతామన్నారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









