ఒమన్ లో సముద్ర క్షీరదాలపై సర్వే.. నాలుగో దశ ప్రాజెక్ట్ ప్రారంభం..!!
- October 23, 2024
ఖాసబ్: సముద్ర క్షీరదాల సర్వే ప్రాజెక్టు నాలుగో దశ ఖాసబ్ ముసందం గవర్నరేట్లోని విలాయత్లో ప్రారంభమైంది. వివిధ ప్రభుత్వ శాఖల సహకారంతో ఎన్విరాన్మెంట్ అథారిటీ ఈ ప్రాజెక్టును అమలు చేస్తుంది. అక్టోబర్ 31 వరకు సర్వే కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ లో భాగంగా ముసందమ్లోని నేషనల్ నేచర్ పార్క్లో సముద్రపు క్షీరదాల సమగ్ర డేటాబేస్ను అభివృద్ధి చేయనున్నట్టు ఎన్విరాన్మెంట్ అథారిటీకి చెందిన ప్రాజెక్ట్ టీమ్ హెడ్ ఇంజనీర్ ఐదా బింట్ ఖలాఫ్ అల్ జబ్రియా తెలిపారు. ఆధునాతన టెక్నాలజీ సాయంతో సర్వే నిర్వహిస్తున్నట్లు.. పగడ్బందీగా ఫోటోలు సహా వివరాలను నమోదు చేస్తున్నట్టు పేర్కొన్నారు. అధిక-నాణ్యత కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, గోప్రోలను ఉపయోగించి డేటాను రికార్డు చేస్తున్నట్లు తెలిపారు. సముద్రపు క్షీరదాల ఉనికి, వాటి పునరుత్పత్తిని తెలుసుకునేందుకు పర్యావరణ అథారిటీ ఆసక్తిగా ఉందని ఆయన వివరించారు. ప్రాజెక్ట్ నిర్వహణకు మత్స్యకారుల నుండి విస్తృత సహాయాన్ని తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







