పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 46వ చిత్రంగా రాబోతున్న రణమండల
- October 26, 2024
స్టార్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ నిర్మాణ సారధ్యంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై పీ ఎమ్ ఎఫ్ - 46వ చిత్రానికి సన్నాహాలు మొదలైయ్యాయి. భారీ యాక్షన్ డివోషనల్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది.హనుమంతుని నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రంలో వీ ఎఫ్ ఎక్స్, యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలు కీలకంగా ఉండనున్నాయి.ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన, ఆదోని రణమండల దేవాలయంలో అట్టహాసంగా జరిగింది.రణమండల ఆంజనేయుని సన్నిథానంలో వేద పండితుల ఆశీర్వచనాలతో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గారు సమక్షంలో రణమండల చిత్రం టైటిల్ ఎనౌన్స్ మెంట్ తో పాటు, ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. రణమండల ఆంజనేయని దేవాలయ క్షేత్ర నామాన్నే ఈ చిత్రానికి టైటిల్ గా పెట్టడం విశేషం. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు తర్వలోనే అధికారికంగా విడుదలవుతాయి. టైటిల్ ఎనౌన్స్ మెంట్ సందర్భంగా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ తన స్వస్థలం ఆదోనిలో సినిమాలు షూటింగ్ చేయాలనే ఎప్పటినుంచో సన్నాహాలు చేస్తున్నప్పటికీ సరైన సమయం, కథ కోసం ఇన్నాళ్లు వెయిట్ చేయాల్సి వచ్చిందని, అయితే రణమండల కథ 2022 నుంచే సిద్ధం చేస్తున్నామని, పూర్తిగా ఆదోని పరిసర ప్రాంతాల్లోనే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జరుగుతుందని చెప్పారు. అలానే ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు వివరాలతో పాటు, టెక్నీషయన్ల వివరాలు త్వరలోనే అఫీషయల్ గా ఎనౌన్స్ మెంట్ చేస్తామని తెలిపారు. రణమండల ఆంజనేయని సన్నిధిలో రణమండల టైటిల్ ఎనౌన్స్ మెంట్ జరగడం తనకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని, నవంబర్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి రానున్న పీ ఎమ్ ఎఫ్ 47వ చిత్రాన్ని కూడా ఆదోనిలోనే పూజా కార్యక్రమాలతో ప్రారంభించి, పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ నిర్వహించే విధంగా సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిపారు. మొత్తంగా రెండు చిత్రాల్ని ఆదోనిలో ప్రారంభించి షూటింగ్ పూర్తి చేసి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా వివరించారు. డివోషనల్, మైథాలజికల్ టచ్ ఉన్న చిత్రాలకి పాన్ ఇండియా వైడ్ రెస్పాన్స్ అద్భుతంగా ఉంటుందని, తమ బ్యానర్ లోనే వచ్చిన కార్తికేయ 2 కి వచ్చిన ఆదరణ, అవార్డులు అందుకు అద్భుతమైన ఉదాహరణ అని తెలిపారు. రణమండల చిత్రానికి కూడా అదే రీతిన ప్రేక్షకుల ఆదరణ దక్కుతుందని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ అన్నారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









