మానవ రహిత విమానం వచ్చేసింది!

- October 26, 2024 , by Maagulf
మానవ రహిత విమానం వచ్చేసింది!

హైదరాబాద్: నిట్ట నిలువుగా టేకాఫ్‌తో పాటు, భూమి మీదకు దిగే సామర్థ్యం (VTOL) ఉన్న మానవ రహిత సరుకు రవాణా విమానాన్ని బ్లూజే ఏరోస్పేస్‌ ఆవిష్కరించింది. దీని పనితీరును హైదరాబాద్‌ సమీపంలోని నాదర్‌గుల్‌ ఎయిర్‌ఫీల్డ్‌లో శ‌నివారం ప్రయోగాత్మకంగా పరీక్షించింది. వాణిజ్య స్థాయిలో పూర్తి విమానాన్ని 2026 నాటికి సిద్ధం చేయనున్నట్లు బ్లూజే ఏరో సహ వ్యవస్థాపకులు అమర్‌దీప్‌ శ్రీ వత్సవాయ, ఉత్తమ్‌ కుమార్‌ వివరించారు. 100 కిలోల బరువును 300 కిలోమీటర్ల దూరం మోసుకెళ్లే సామర్థ్యం దీనికి ఉందని, సరుకుల‌ రవాణాలో ఇది ఎంతో కీలకంగా మారుతుందని చెప్పారు.

హైదరాబాద్‌ నుంచి వరంగల్‌కు 30 నిమిషాల వ్యవధిలో చేరగలదని, గ్రామీణ ప్రాంతాలకూ సేవలు అందించేందుకు ఇది తోడ్పడుతుందని విశ్లేషించారు. 2026 నాటికి హైడ్రోజన్‌-విద్యుత్‌ ప్రొపెల్షన్‌తో అటానమస్‌ ఫ్లైట్‌ తీసుకొస్తున్నట్లు స్పష్టం చేశారు. అప్పుడే మనుషులను తీసుకెళ్లే వీటీఓఎల్‌ విమానాన్నీ ఆవిష్కరించబోతున్నట్లు వెల్లడించారు. దీనివల్ల విమానాశ్రయాలు లేని ప్రాంతాలకూ విమాన సేవలను అందించేందుకు వీలవుతుందని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com