ఇకపై ఇంటి దగ్గరికే TGSRTC కార్గో సేవలు - మంత్రి పొన్నం
- October 26, 2024
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ (TGSRTC) ఇకపై ఇంటి దగ్గరికి కార్గో సేవలను అందించనుంది.ఈ సేవలను హైదరాబాద్లో పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించి, 27 అక్టోబర్ 2024 నుండి హోం డెలివరీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. త్వరలోనే ఈ సేవలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ఈ విషయమై మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్లో జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “మా ప్రభుత్వానిది ప్రజాపాలన. మహిళల ప్రభుత్వమని, ఆర్టీసీ సేవలను మరింత విస్తరించేందుకు కృషి చేస్తున్నాం అని తెలిపారు.త్వరలోనే 3 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నాం. విద్యుత్ బస్సుల కొనుగోలుకు జేబీఎం సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం. కాలుష్యాన్ని తగ్గించేందుకు డీజిల్ బస్సులను పూర్తిగా తొలగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం” అని తెలిపారు.త్వరలోనే TGSRTC కార్గో సేవలు రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!*
- 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!
- ప్రశాంతమైన రమదాన్ కోసం దుబాయ్ పోలీసుల అడుగులు
- జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం..
- గ్లోబల్ విలేజ్లో ఈద్ బాణాసంచా వేడుకలు రద్దు..
- ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త..
- ఆహార భద్రతా వ్యవస్థను సమీక్షించిన మినిస్టర్ టీమ్..!!
- అల్ సహ్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రవాసులు మృతి..!!
- ఫేక్ బ్రాండెడ్ గూడ్స్..మనీలాండరింగ్.. Dh1-మిలియన్ ఫైన్, ఏడాది జైలు..!!
- భద్రతా పరమైన సంఘటనల వీడియోలు తీయవద్దు..!!









