ఇకపై ఇంటి దగ్గరికే TGSRTC కార్గో సేవలు - మంత్రి పొన్నం
- October 26, 2024
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ (TGSRTC) ఇకపై ఇంటి దగ్గరికి కార్గో సేవలను అందించనుంది.ఈ సేవలను హైదరాబాద్లో పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించి, 27 అక్టోబర్ 2024 నుండి హోం డెలివరీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. త్వరలోనే ఈ సేవలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ఈ విషయమై మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్లో జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “మా ప్రభుత్వానిది ప్రజాపాలన. మహిళల ప్రభుత్వమని, ఆర్టీసీ సేవలను మరింత విస్తరించేందుకు కృషి చేస్తున్నాం అని తెలిపారు.త్వరలోనే 3 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నాం. విద్యుత్ బస్సుల కొనుగోలుకు జేబీఎం సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం. కాలుష్యాన్ని తగ్గించేందుకు డీజిల్ బస్సులను పూర్తిగా తొలగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం” అని తెలిపారు.త్వరలోనే TGSRTC కార్గో సేవలు రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో హాటెస్ట్ మంత్ గా జూలై ఉండబోతుందా?
- అండర్ 16 సోషల్ మీడియా బ్యాన్..ఆస్ట్రేలియా సంచలన స్టడీ..!!
- షాపింగ్ ప్రియులకు లూలూ హైపర్మార్కెట్ కువైట్ శుభవార్త..!!
- 52 మాగ్నెట్స్ మింగిన 5 ఏళ్ల బాలుడు..డాక్టర్లు ఏమన్నారంటే?
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియో..దోహాలో 25 మంది అరెస్ట్
- మొహర్రం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- భారత పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. ఇది కేవలం ప్రయాణ పత్రం మాత్రమే: విదేశాంగ శాఖ
- డెకాయ్ ఆపరేషన్లతో పోలీసుల బాగోతం బట్టబయలు: సీపీ సజ్జనార్
- హోర్ముజ్ జలసంధి పై సుంకాలు ఉండవు..అమెరికాకు తెలిపిన ఇరాన్
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి







