ఇకపై ఇంటి దగ్గరికే TGSRTC కార్గో సేవలు - మంత్రి పొన్నం
- October 26, 2024
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ (TGSRTC) ఇకపై ఇంటి దగ్గరికి కార్గో సేవలను అందించనుంది.ఈ సేవలను హైదరాబాద్లో పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించి, 27 అక్టోబర్ 2024 నుండి హోం డెలివరీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. త్వరలోనే ఈ సేవలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ఈ విషయమై మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్లో జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “మా ప్రభుత్వానిది ప్రజాపాలన. మహిళల ప్రభుత్వమని, ఆర్టీసీ సేవలను మరింత విస్తరించేందుకు కృషి చేస్తున్నాం అని తెలిపారు.త్వరలోనే 3 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నాం. విద్యుత్ బస్సుల కొనుగోలుకు జేబీఎం సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం. కాలుష్యాన్ని తగ్గించేందుకు డీజిల్ బస్సులను పూర్తిగా తొలగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం” అని తెలిపారు.త్వరలోనే TGSRTC కార్గో సేవలు రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









