కిడ్నీలకు ముప్పుతెచ్చే డయాబెటీస్, బీపీ
- July 07, 2015
మన శరీరంలో కిడ్నీలు రక్తాన్ని శుద్ధి చేయటంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. కిడ్నీలలోని అతి చిన్న భాగాలు ముఖ్యంగా ఈ వడపోత పనిని చేయడం జరుగుతుంది. ఈ భాగాలను గ్లోమరులస్ అని అంటారు. ఇవి కిడ్నీల్లో లక్షల సంఖ్యలో ఉంటాయి. హైబీపీ ఉన్నవారిలో రక్తం అధిక పీడనం, ఒత్తిడి కలిగి ఈ గ్లోమరులస్ పొరలలోకి చేరడం వల్ల ఈ పొరలు కూడా అధికంగా పీడనానికి గురి కావడం జరుగుతుంది. దాంతో పొరల యొక్క గోడలు దళసరిగా మారడంతో వడపోత సామర్థ్యం తగ్గిపోవడం జరుగుతుంది. మధుమేహం ఉన్న వారి రక్తంలో గ్లూకోజ్ శాతం అధికంగా ఉంటుంది. ఈ అధిక గ్లూకోజ్ ఉన్న రక్తం గ్లోమరులస్ పొరలలోకి చేరడం వల్ల అక్కడ గ్లూకోజ్ శాతం ఎక్కువయి ఈ పొరలు తమ స్వభావాన్ని మార్చుకోవడం వల్ల వడపోత సామర్ధ్యం మరింత దెబ్బతినే అవకాశం ఉంది. కిడ్నీ సమస్యలను తెలుసుకోవడానికి చాలా మంది సీరం క్రియాటినన్ అనే పరీక్ష చేయించుకుంటుంటారు. అదొక్కటే పూర్తిగా కిడ్నీ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి సరిపోదు. 'ఈజీఎఫ్ఆర్' అనే పరీక్ష చేయించుకోవడం ద్వారా కిడ్నీల పూర్తి పనితీరును తెలుసుకోవచ్చు. డాక్టర్ల సూచన మేరకు క్రమం తప్పకుండా స్కానింగ్, ఇతరత్రా పరీక్షలు చేయించుకుని, తగిన వైద్య సహాయం పొందితే మధుమేహులు, బీపీతో బాధపడ్తున్నవారు కిడ్నీలను సంరక్షించుకోవచ్చు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







