కిడ్నీలకు ముప్పుతెచ్చే డయాబెటీస్, బీపీ
- July 07, 2015
మన శరీరంలో కిడ్నీలు రక్తాన్ని శుద్ధి చేయటంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. కిడ్నీలలోని అతి చిన్న భాగాలు ముఖ్యంగా ఈ వడపోత పనిని చేయడం జరుగుతుంది. ఈ భాగాలను గ్లోమరులస్ అని అంటారు. ఇవి కిడ్నీల్లో లక్షల సంఖ్యలో ఉంటాయి. హైబీపీ ఉన్నవారిలో రక్తం అధిక పీడనం, ఒత్తిడి కలిగి ఈ గ్లోమరులస్ పొరలలోకి చేరడం వల్ల ఈ పొరలు కూడా అధికంగా పీడనానికి గురి కావడం జరుగుతుంది. దాంతో పొరల యొక్క గోడలు దళసరిగా మారడంతో వడపోత సామర్థ్యం తగ్గిపోవడం జరుగుతుంది. మధుమేహం ఉన్న వారి రక్తంలో గ్లూకోజ్ శాతం అధికంగా ఉంటుంది. ఈ అధిక గ్లూకోజ్ ఉన్న రక్తం గ్లోమరులస్ పొరలలోకి చేరడం వల్ల అక్కడ గ్లూకోజ్ శాతం ఎక్కువయి ఈ పొరలు తమ స్వభావాన్ని మార్చుకోవడం వల్ల వడపోత సామర్ధ్యం మరింత దెబ్బతినే అవకాశం ఉంది. కిడ్నీ సమస్యలను తెలుసుకోవడానికి చాలా మంది సీరం క్రియాటినన్ అనే పరీక్ష చేయించుకుంటుంటారు. అదొక్కటే పూర్తిగా కిడ్నీ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి సరిపోదు. 'ఈజీఎఫ్ఆర్' అనే పరీక్ష చేయించుకోవడం ద్వారా కిడ్నీల పూర్తి పనితీరును తెలుసుకోవచ్చు. డాక్టర్ల సూచన మేరకు క్రమం తప్పకుండా స్కానింగ్, ఇతరత్రా పరీక్షలు చేయించుకుని, తగిన వైద్య సహాయం పొందితే మధుమేహులు, బీపీతో బాధపడ్తున్నవారు కిడ్నీలను సంరక్షించుకోవచ్చు.
తాజా వార్తలు
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!









