ఖతార్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు
- July 07, 2015
ఈరోజు నుండి దేశమంతటా ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని, బలమైన ఇసుక తుఫాను గాలులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వారు తెలియజేశారు . అత్యధికంగా 45 డెగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండవచ్చని, రువాఇస్, దుఖాన్ మరియు అబూ సమ్రాలలో కాస్త తక్కువ ఉస్నోగ్రతలు నమోదవచ్చని తెలిసింది. నిన్నటి మాదిరిగానే దోహా, అల్ ఖోర్, వక్రాహ్ మరియు మెశాయీద్ లలో వేడి వాతావరణం నెలకొనవచ్చు. అబూ సమ్రా మరియు దుఖాన్ లలో 36 నుండి 38 డెగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చు. వాతావరణ శాఖవారి నివేదిక ప్రకారం, వాయువ్య దిశలోని తీవ్రగాలులు దేశమంతా విజృంభిస్తాయని, కానీ రాత్రిపూట మాత్రం కొంత తగ్గే అవకాశముందని వారుచెప్పారు. తీరానికి దూరంగా ఉన్న ప్రాంతాలలో కూడా గాలుల నెదుర్కొంటాయని చెప్పారు. ఈ ఇసుక తుఫానుల వలన సుమారు రెండు కిలోమీటర్ల వరకు దృష్టి గోచరత తగ్గిపోతుందని, తీర ప్రాంతాలలో నీటి మట్టం 10 అడుగుల వరకు పెరుగుతుందని, సాయంత్రం మూడు నుండి ఐదు అడుగుల వరకు తగ్గుతుందని తెలియవచ్చింది.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









