ఖతార్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు
- July 07, 2015
ఈరోజు నుండి దేశమంతటా ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని, బలమైన ఇసుక తుఫాను గాలులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వారు తెలియజేశారు . అత్యధికంగా 45 డెగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండవచ్చని, రువాఇస్, దుఖాన్ మరియు అబూ సమ్రాలలో కాస్త తక్కువ ఉస్నోగ్రతలు నమోదవచ్చని తెలిసింది. నిన్నటి మాదిరిగానే దోహా, అల్ ఖోర్, వక్రాహ్ మరియు మెశాయీద్ లలో వేడి వాతావరణం నెలకొనవచ్చు. అబూ సమ్రా మరియు దుఖాన్ లలో 36 నుండి 38 డెగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చు. వాతావరణ శాఖవారి నివేదిక ప్రకారం, వాయువ్య దిశలోని తీవ్రగాలులు దేశమంతా విజృంభిస్తాయని, కానీ రాత్రిపూట మాత్రం కొంత తగ్గే అవకాశముందని వారుచెప్పారు. తీరానికి దూరంగా ఉన్న ప్రాంతాలలో కూడా గాలుల నెదుర్కొంటాయని చెప్పారు. ఈ ఇసుక తుఫానుల వలన సుమారు రెండు కిలోమీటర్ల వరకు దృష్టి గోచరత తగ్గిపోతుందని, తీర ప్రాంతాలలో నీటి మట్టం 10 అడుగుల వరకు పెరుగుతుందని, సాయంత్రం మూడు నుండి ఐదు అడుగుల వరకు తగ్గుతుందని తెలియవచ్చింది.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!









