ఎలుకలు కొరికిన వాటర్మెలన్
- June 23, 2016
బహ్రెయిన్లో కొందరు అక్రమ వ్యాపారులు పాడైపోయిన ఆహార పదార్థాలకు మెరుగుపెట్టి విక్రయిస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, అక్రమ వ్యాపారుల ఆగడాలకు అడ్డుకట్ట పడటంలేదు. రోడ్లపైనా, చిన్న చిన్న దుకాణాల్లోనూ కూరగాయలు, పండ్లు అమ్మే వ్యాపారులే అ అక్రమాలకు ఎక్కువగా పాల్పడుతున్నారు. ఎలుకలు కొరికిన వాటర్ మెలన్ని సగం కట్ చేసి, వీధుల్లో అమ్ముతున్న విషయం వెలుగు చూసింది. అలాగే కాలీఫ్లవర్, క్యాబేజీలను సబ్బుతో వాష్ చేసి విక్రయిస్తున్నారు. సెంట్రల్ వెజిటబుల్ మార్కెట్లో పాడైపోయిన వాటిని డస్ట్బిన్స్లో పడేస్తుంటారు. వీటిని, ఇల్లీగల్ స్ట్రీన వెండర్స్ సేకరించి, విక్రయించడం జరుగుతుంది. ఈ ఇల్లీగల్ బిజినెస్ వెనుక పెద్ద నెట్ వర్క్ ఉందన్న ఆరోపణలు వినవస్తున్నాయి. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







