అబుదాబిలో బోట్ యజమానికి 20,000 దిర్హామ్ల జరిమానా..!!
- November 03, 2024
యూఏఈ: అబుదాబిలో రోజువారీ పరిమితిని మించి చేపలను పట్టిన ఫిషింగ్ బోట్ యజమానికి పర్యావరణ సంస్థ Dh20,000 జరిమానా విధించింది. ఫిషింగ్ బోట్లు కమర్షియల్ ఫిషింగ్ లైసెన్స్ని పొంది ఉండాలి. సాధారణంగా ఈ తరహా నౌకలు వీటిని కలిగి ఉండవు. ఈ లైసెన్స్ లేకుండా చేపలు పట్టడం పర్యావరణ ఉల్లంఘనగా పరిగణిస్తారు. ఇందుకుగానూ 2,000 దిర్హామ్ జరిమానాతో శిక్షిస్తారు. మరోసారి ఇలాంటి చట్టఉల్లంఘన పునరావృతం చేసే నేరస్థులపై భారీ జరిమానాలను విధిస్తారు. వివిధ జాతుల చేపలు పట్టడానికి యూఏఈలో వేర్వేరు సీజన్ లు ఉంటాయి. ఈ మేరకు అనుమతులను జారీ చేస్తారు. వాటి సంతానోత్పత్తి కాలాలను దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు నిర్ణయిస్తారు.
--ప్రదీప్ (మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









