అబుదాబిలో బోట్ యజమానికి 20,000 దిర్హామ్ల జరిమానా..!!
- November 03, 2024
యూఏఈ: అబుదాబిలో రోజువారీ పరిమితిని మించి చేపలను పట్టిన ఫిషింగ్ బోట్ యజమానికి పర్యావరణ సంస్థ Dh20,000 జరిమానా విధించింది. ఫిషింగ్ బోట్లు కమర్షియల్ ఫిషింగ్ లైసెన్స్ని పొంది ఉండాలి. సాధారణంగా ఈ తరహా నౌకలు వీటిని కలిగి ఉండవు. ఈ లైసెన్స్ లేకుండా చేపలు పట్టడం పర్యావరణ ఉల్లంఘనగా పరిగణిస్తారు. ఇందుకుగానూ 2,000 దిర్హామ్ జరిమానాతో శిక్షిస్తారు. మరోసారి ఇలాంటి చట్టఉల్లంఘన పునరావృతం చేసే నేరస్థులపై భారీ జరిమానాలను విధిస్తారు. వివిధ జాతుల చేపలు పట్టడానికి యూఏఈలో వేర్వేరు సీజన్ లు ఉంటాయి. ఈ మేరకు అనుమతులను జారీ చేస్తారు. వాటి సంతానోత్పత్తి కాలాలను దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు నిర్ణయిస్తారు.
--ప్రదీప్ (మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల