విజిట్ ఖతార్.. వింటర్ సీజన్ కోసం స్పెషల్ క్యాంపెయిన్..!!
- November 03, 2024
దోహా: విజిట్ ఖతార్ "కతార్ అలా హవాక్" పేరుతో తన కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. ఇది ఖతార్ ప్రత్యేకమైన వింటర్ సీజన్ కోసం GCC దేశాల్లో క్యాంపెయిన్ నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా వింటర్ సీజన్ ఎస్కేప్కు ప్రముఖ గమ్యస్థానంగా ఖతార్ తన స్థానాన్ని ఎలివేట్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. అన్ని ఆసక్తులు, వయస్సులకు అనుగుణంగా తప్పనిసరిగా సందర్శించాల్సిన ఆకర్షణలు,ఈవెంట్లు ఉన్నాయి.ఈ ప్రచారంలో సౌదీ నటుడు యూసఫ్ అల్ జర్రా, బహ్రెయిన్ కళాకారుడు అహ్మద్ షరీఫ్ నటించారు. విజిట్ ఖతార్ CEO అబ్దుల్ అజీజ్ అలీ అల్ మావ్లావి మాట్లాడుతూ.. ఖతార్ వింటర్ సీజన్ చిన్న పెద్ద విహారయాత్రలకు సరైన గమ్యస్థానంగా మారిందన్నారు. ప్రతి పర్యాటకుడికి మరపురాని క్షణాలను సృష్టించడం తమ లక్ష్యమన్నారు. థ్రిల్లింగ్ అడ్వెంచర్లను కోరుకునే వారి కోసం దోహాలోని ఇండోర్ థీమ్ పార్క్ అయిన క్వెస్ట్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఇండోర్ రోలర్ కోస్టర్, డ్రాప్ టవర్ను కలిగి ఉంది. 2023లో రికార్డు స్థాయిలో నాలుగు మిలియన్ల మంది సందర్శకులు సందర్శించారు. ఈ సంవత్సరం అక్టోబర్ నాటికి 3.9 మిలియన్ల సందర్శకులు వచ్చినట్టు తెలిపారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- కువైట్లో వారం రోజుల్లో 25 వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- మస్కట్లో అల్ అమెరికాత్ ఓవర్పాస్ తాత్కాలికంగా మూసివేత..!!
- సోషల్ మీడియాలో పిల్లల ఫొటోల షేరింగ్ పై అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- అబుదాబి నుంచి భారత్ లోని నాలుగు కొత్త నగరాలకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్స్..!!
- అమ్మాన్లో అరబ్ దేశాల కీలక సమావేశం.. ఇజ్రాయెల్ చర్యలపై తీవ్ర ఆందోళన..!!
- సౌదీలో డొమెస్టిక్ వర్కర్ల బదిలీకి కొత్త సర్వీస్..!!
- హర్మూజ్ జలసంధిలో కొత్త వాణిజ్య మార్గంపై ఇరాన్, ఒమన్ మధ్య అంగీకారం
- పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆప్'కే స్వల్ప ఆధిక్యం: 'పీపుల్స్ పల్స్' మూడ్ సర్వే
- బహ్రెయిన్లో రాత్రి 9 గంటల తర్వాత నిర్మాణ పనులకు బ్రేక్..పెరుగుతున్న డిమాండ్లు..!!
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్







