విద్యార్థులతో కలిసి జెండా ఎగురవేసిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- November 03, 2024
యూఏఈ: నవంబర్ 3న యూఏఈ జెండా దినోత్సవాన్ని పురస్కరించుకొని అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ కసర్ అల్ హోస్న్లో జెండాను ఎగురవేశారు. "మేము చాలా మంది అత్యుత్తమ విద్యార్థులతో కలిసి కస్ర్ అల్ హోస్న్లో యూఏఈ జెండాను గర్వంగా ఎగురవేశాను" అని షేక్ మొహమ్మద్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా, యూఏఈ ప్రధాన మంత్రి "మన యూనియన్, మన ఐక్యత, మన బలానికి చిహ్నం" అనే జెండాను హైలైట్ చేసే వీడియోను పంచుకున్నారు. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ జెండాను "మన గర్వం, మన కీర్తి, మన దేశ చిహ్నం" అని కొనియాడారు.
నవంబర్ 1న దుబాయ్ పాలకుల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అనేక సంస్థలు ఒకే సమయంలో (ఉదయం 11 గంటలకు) యూఏఈ జెండాను ఎగురవేశారు. అంతకుముందు, యూఏఈలో కీలకమైన జాతీయ సందర్భాలను జరుపుకోవడానికి దుబాయ్ కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం నవంబర్ 3 నుండి డిసెంబర్ 3 వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో, నివాసితులు బాణసంచా కాల్చడం, సంగీత కచేరీలను ఆస్వాదించవచ్చు. ఉత్సవాల్లో భాగంగా మార్కెట్లు, లైట్ షోలు, దుబాయ్ విమానాశ్రయాలలో ప్రత్యేక ఈవెంట్లను నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







