దుబాయ్ లో రోడ్డు ప్రమాద మరణాల నివారణకు ప్రత్యేక చర్యలు..!!
- November 03, 2024
యూఏఈ: రోజువారీ రవాణాను సురక్షితంగా..అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి దుబాయ్ నిరంతరం కృషి చేస్తుంది. ఎమిరేట్ తరచుగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అమలు చేస్తుంది. భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించిన వారిపై భారీ జరిమానాలు విధిస్తుంది. ఇటీవల, ఎమిరేట్ కొత్త ట్రాఫిక్ చట్టాన్ని కూడా ఆమోదించింది. ఇది 14 వేర్వేరు ఉల్లంఘనలకు జరిమానాలను వివరించింది. వాటిలో కొన్ని జైవాకింగ్కు భారీ జరిమానాలు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోన్లను ఉపయోగించడం, ఆకస్మిక రోడ్ క్రాస్ చేయడం వంటివి చేస్తే వాహనాలను 30-రోజులపాటు సీజ్ చేస్తామని కమాండర్-ఇన్-చీఫ్, లెఫ్టినెంట్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి వెల్లడించారు. రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించే లక్ష్యంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి తాజా స్మార్ట్ టెక్ని ఉపయోగించి నిర్ణయం తీసుకుంటున్నారు.
సెప్టెంబరులో, షార్జా పోలీసులు గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 2024 మొదటి అర్ధ భాగంలో 100,000 మంది నివాసితులకు 15 శాతం, దీనితో పాటు ప్రతి 10,000 వాహనాలకు 9 శాతం ట్రాఫిక్ ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని అల్ మర్రీ తెలిపారు. ఇదిలా ఉండగా, అక్టోబర్ ప్రారంభంలో, మెట్రోలో ఇ-స్కూటర్ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్రకటించడంపై నివాసితులు సంతోషించారు.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









