దుబాయ్ లో రోడ్డు ప్రమాద మరణాల నివారణకు ప్రత్యేక చర్యలు..!!
- November 03, 2024
యూఏఈ: రోజువారీ రవాణాను సురక్షితంగా..అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి దుబాయ్ నిరంతరం కృషి చేస్తుంది. ఎమిరేట్ తరచుగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అమలు చేస్తుంది. భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించిన వారిపై భారీ జరిమానాలు విధిస్తుంది. ఇటీవల, ఎమిరేట్ కొత్త ట్రాఫిక్ చట్టాన్ని కూడా ఆమోదించింది. ఇది 14 వేర్వేరు ఉల్లంఘనలకు జరిమానాలను వివరించింది. వాటిలో కొన్ని జైవాకింగ్కు భారీ జరిమానాలు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోన్లను ఉపయోగించడం, ఆకస్మిక రోడ్ క్రాస్ చేయడం వంటివి చేస్తే వాహనాలను 30-రోజులపాటు సీజ్ చేస్తామని కమాండర్-ఇన్-చీఫ్, లెఫ్టినెంట్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి వెల్లడించారు. రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించే లక్ష్యంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి తాజా స్మార్ట్ టెక్ని ఉపయోగించి నిర్ణయం తీసుకుంటున్నారు.
సెప్టెంబరులో, షార్జా పోలీసులు గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 2024 మొదటి అర్ధ భాగంలో 100,000 మంది నివాసితులకు 15 శాతం, దీనితో పాటు ప్రతి 10,000 వాహనాలకు 9 శాతం ట్రాఫిక్ ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని అల్ మర్రీ తెలిపారు. ఇదిలా ఉండగా, అక్టోబర్ ప్రారంభంలో, మెట్రోలో ఇ-స్కూటర్ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్రకటించడంపై నివాసితులు సంతోషించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల