ఏ సర్టిఫికేట్ పొందిన త్రిష నాయకి..
- June 23, 2016
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్స్ త్రిష ఈ మధ్య మళ్లీ జోరందుకుందని అనాలి.. ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరో పక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఆకట్టుకుంటున్న త్రిష ప్రస్తుతం నాయకిగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. కొద్దికాలంగా పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు సెన్సార్ ముగించుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది.
త్రిష ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకుంది. ఓ పక్క మోడ్రెన్ గాళ్ గా కనిపిస్తూ పల్లెటూరి అమ్మాయిలా త్రిష కనబడనుంది. ఇక సస్పెన్స్ హర్రర్ కామెడీ మిక్స్ చేస్తూ దర్శకుడు గోవి సినిమాను తీర్చిదిద్దిన విధానం సెన్సార్ వారికి బాగా నచ్చిందట. సినిమాకు ఏ సర్టిఫికేట్ ఇచ్చి త్రిషకు మరో హిట్ అన్నట్టు చెప్పారట.
సో మొత్తానికి సెన్సార్ మెప్పు పొందిన త్రిష నాయకి ఇక రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయాల్సి ఉంది. ఓ పక్క వరుస బెట్టి సినిమాలు రిలీజ్ అవుతున్న ఈ తరుణంలో త్రిష నాయకికి రిలీజ్ అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన నయాకి టీం సినిమాను వీలైనంత త్వరలో రిలీజ్ చేసేలా చూస్తున్నారు.
కళావతి, చీకటి రాజ్యం సినిమాలతో కెరియర్ లో 50 సినిమాల మైలు రాయిని క్రాస్ చేసిన త్రిష నాయకి సినిమాతో మరో మెట్టు ఎక్కుతుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు. మరి త్రిష చేస్తున్న ఈ ప్రయోగం ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి. సత్యం రాజేష్ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోశించడం జరిగింది
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







