టీటీడీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన బీఆర్ నాయుడు..
- November 06, 2024
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి చైర్మన్గా బొల్లినేని రాజగోపాల్ నాయుడు బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ మేరకు ఆయనతో ఆలయ ఈవో శ్యామలరావు ప్రమాణం చేయించారు. ఆలయ సంప్రదాయాలను ప్రకారం.. ముందుగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వరాహ స్వామి వారిని దర్శించుకుని అక్కడి నుంచి శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లారు.
ఆయనతో పాటు బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కోటేశ్వరావు, మల్లెల రాజశేఖర్ గౌడ్, కృష్ణమూర్తి, ఎంఎస్ రాజు, పనబాక లక్ష్మి, నర్సిరెడ్డి, సాంబశివరావు, నన్నపనేని సదాశివరావు, జంగా కృష్ణమూర్తి, ఆర్ఎన్ దర్శన్, జస్టిస్ హెచ్ఎల్ దత్, శాంతరామ్, రామ్మూర్తి, తమ్మిశెట్టి జానకీదేవి, బి.మహేందర్ రెడ్డి, అనుగోలు రంగశ్రీ, సుచిత్ర ఎల్లా, బూరగపు ఆనందసాయి, నరేశ్కుమార్, డాక్టర్ అదిత్ దేశాయ్, సౌరభ్ హెచ్.బోరా, భానుప్రకాశ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









