టీటీడీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన బీఆర్ నాయుడు..
- November 06, 2024
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి చైర్మన్గా బొల్లినేని రాజగోపాల్ నాయుడు బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ మేరకు ఆయనతో ఆలయ ఈవో శ్యామలరావు ప్రమాణం చేయించారు. ఆలయ సంప్రదాయాలను ప్రకారం.. ముందుగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వరాహ స్వామి వారిని దర్శించుకుని అక్కడి నుంచి శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లారు.
ఆయనతో పాటు బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కోటేశ్వరావు, మల్లెల రాజశేఖర్ గౌడ్, కృష్ణమూర్తి, ఎంఎస్ రాజు, పనబాక లక్ష్మి, నర్సిరెడ్డి, సాంబశివరావు, నన్నపనేని సదాశివరావు, జంగా కృష్ణమూర్తి, ఆర్ఎన్ దర్శన్, జస్టిస్ హెచ్ఎల్ దత్, శాంతరామ్, రామ్మూర్తి, తమ్మిశెట్టి జానకీదేవి, బి.మహేందర్ రెడ్డి, అనుగోలు రంగశ్రీ, సుచిత్ర ఎల్లా, బూరగపు ఆనందసాయి, నరేశ్కుమార్, డాక్టర్ అదిత్ దేశాయ్, సౌరభ్ హెచ్.బోరా, భానుప్రకాశ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







