తెలంగాణ: అరుణాచ‌లం టూర్‌కు ప్ర‌త్యేక బ‌స్సులు

- November 07, 2024 , by Maagulf
తెలంగాణ: అరుణాచ‌లం టూర్‌కు ప్ర‌త్యేక బ‌స్సులు

హైదరాబాద్: కార్తీక పౌర్ణ‌మి సంద‌ర్భంగా అరుణాచలేశ్వరుడి గిరి ప్రదక్షిణకు దేశ న‌లుమూల నుంచి భ‌క్తులు వెళుతుంటారు.అలాగే తెలంగాణ నుంచి కూడా అధిక సంఖ్య‌లో భ‌క్తులు వెళ్ల‌నున్నారు.దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్ర‌త్యేక ప్యాకేజీ బ‌స్సులు న‌డ‌ప‌డానికి, అద్దె ప్రాతిప‌దిక‌న ఇవ్వ‌డానికి టీజీఎస్ ఆర్టీసీ నిర్ణ‌యించింది.తెలంగాణ‌లోని హైద‌రాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెద‌క్, న‌ల్ల‌గొండ‌, వరంగ‌ల్, క‌రీంన‌గ‌ర్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నుంచి అరుణాచ‌లానికి ప్ర‌త్యేక బ‌స్సుల‌ను న‌డుపుతోంది.

ప్ర‌త్యేక ప్యాకేజీ బ‌స్సులు…
ఈనెల 15న కార్తీక పౌర్ణ‌మి కాగా, 13నుంచి ఆయా ప్రాంతాల నుంచి ప్ర‌త్యేక బ‌స్సులు బ‌య‌లుదేరుతాయి. కాణిపాకం, గొల్డెన్ టెంపుల్ ద‌ర్శ‌నం త‌ర్వాత కార్తీక పౌర్ణ‌మి పర్వ‌దినం రోజున‌ అరుణాచ‌లానికి చేరుకుంటాయి. అరుణాచ‌ల గిరి ప్ర‌దక్షిణ ప్యాకేజీని http://tgsrtcbus.in వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవ‌చ్చని ఆర్టీసీ ప్ర‌క‌టించింది. పూర్తి వివ‌రాల‌కు టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంట‌ర్ నంబ‌ర్లు 040-23450033, 040-69440000 సంప్ర‌దించ‌గ‌లరని సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com