అబుదాబిలో కోల్డ్ప్లే.. ఫ్లైట్ టికెట్ ధరలు 300% పెరుగుదల..!!
- November 07, 2024
యూఏఈ: ప్రపంచవ్యాప్తంగా కోల్డ్ప్లే అభిమానులు 'అడ్వెంచర్ ఆఫ్ ఎ లైఫ్టైమ్' లో ఉన్నారు. ఎందుకంటే వారి బ్యాండ్ మ్యూజిక్ ఆఫ్ ది గోరేస్ వరల్డ్ టూర్ యూఏఈ చేరుకుంది. జనవరి లో నిర్వహించే కాన్సర్ట్ కోసం ఉన్న డిమాండ్ నేపథ్యంలో ఆసియా, ఆఫ్రికా, జిసిసి దేశాల ప్రయాణికులకు విమాన టిక్కెట్ల ధరలు 300% వరకు పెరుగుతాయని భావిస్తున్నారు. జనవరి 9, 11, 12, 14 తేదీలలో 44,600 సీట్ల సామర్థ్యం గల జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో కోల్డ్ప్లే వరుసగా నాలుగు రాత్రుళ్లు ప్రదర్శనలు ఇవ్వనున్నారు.
ట్రావెల్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. భారతదేశం, పాకిస్తాన్, ఇతర జిసిసి దేశాల అభిమానులు అబుదాబి కాన్సర్ట్ లకు హాజరు కావడానికి ఆసక్తి చూపుతారు. అభిమానుల బుకింగ్ లతో ఇప్పటికే విమాన బుకింగ్లు ఫుల్ అవుతున్నాయి. ఇది విమాన ఛార్జీల ధరలను పైకి తీసుకెళుతుందని వైస్ఫాక్స్ టూరిజంలో అవుట్బౌండ్ ట్రావెల్ కోసం సీనియర్ కన్సల్టెంట్ షాంషీద్ సివి అన్నారు. "కోల్డ్ప్లే టిక్కెట్లు భారతదేశంలో క్షణాల్లో అమ్ముడయ్యాయి. ఆసియా, జిసిసి దేశాల అభిమానులు కూడా ఉత్సాహం చూపుతున్నారు. చాలామంది ఇప్పటికే ప్రదర్శన కోసం తమ టిక్కెట్లను బుక్ చేసుకున్నారు. ఇప్పుడు విమానాలలో సీట్ల కోసం డిమాండ్ నెలకొన్నదని షాంషీడ్ అన్నారు. "ప్రస్తుతం, దక్షిణ భారత నగరాల నుండి దుబాయ్ వరకు విమానాలు సగటున DH450 ఖర్చు అవుతుంది. జనవరి రెండవ వారం నుండి డిమాండ్ పెరగడం వల్ల ఈ ఛార్జీలు రెట్టింపు అవుతాయి. ”అని షాంషీడ్ తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







