అబుదాబిలో కోల్డ్ప్లే.. ఫ్లైట్ టికెట్ ధరలు 300% పెరుగుదల..!!
- November 07, 2024
యూఏఈ: ప్రపంచవ్యాప్తంగా కోల్డ్ప్లే అభిమానులు 'అడ్వెంచర్ ఆఫ్ ఎ లైఫ్టైమ్' లో ఉన్నారు. ఎందుకంటే వారి బ్యాండ్ మ్యూజిక్ ఆఫ్ ది గోరేస్ వరల్డ్ టూర్ యూఏఈ చేరుకుంది. జనవరి లో నిర్వహించే కాన్సర్ట్ కోసం ఉన్న డిమాండ్ నేపథ్యంలో ఆసియా, ఆఫ్రికా, జిసిసి దేశాల ప్రయాణికులకు విమాన టిక్కెట్ల ధరలు 300% వరకు పెరుగుతాయని భావిస్తున్నారు. జనవరి 9, 11, 12, 14 తేదీలలో 44,600 సీట్ల సామర్థ్యం గల జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో కోల్డ్ప్లే వరుసగా నాలుగు రాత్రుళ్లు ప్రదర్శనలు ఇవ్వనున్నారు.
ట్రావెల్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. భారతదేశం, పాకిస్తాన్, ఇతర జిసిసి దేశాల అభిమానులు అబుదాబి కాన్సర్ట్ లకు హాజరు కావడానికి ఆసక్తి చూపుతారు. అభిమానుల బుకింగ్ లతో ఇప్పటికే విమాన బుకింగ్లు ఫుల్ అవుతున్నాయి. ఇది విమాన ఛార్జీల ధరలను పైకి తీసుకెళుతుందని వైస్ఫాక్స్ టూరిజంలో అవుట్బౌండ్ ట్రావెల్ కోసం సీనియర్ కన్సల్టెంట్ షాంషీద్ సివి అన్నారు. "కోల్డ్ప్లే టిక్కెట్లు భారతదేశంలో క్షణాల్లో అమ్ముడయ్యాయి. ఆసియా, జిసిసి దేశాల అభిమానులు కూడా ఉత్సాహం చూపుతున్నారు. చాలామంది ఇప్పటికే ప్రదర్శన కోసం తమ టిక్కెట్లను బుక్ చేసుకున్నారు. ఇప్పుడు విమానాలలో సీట్ల కోసం డిమాండ్ నెలకొన్నదని షాంషీడ్ అన్నారు. "ప్రస్తుతం, దక్షిణ భారత నగరాల నుండి దుబాయ్ వరకు విమానాలు సగటున DH450 ఖర్చు అవుతుంది. జనవరి రెండవ వారం నుండి డిమాండ్ పెరగడం వల్ల ఈ ఛార్జీలు రెట్టింపు అవుతాయి. ”అని షాంషీడ్ తెలిపారు.
తాజా వార్తలు
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!







