జెయింట్ స్పీడ్ ల్యాప్గా మారిన షేక్ జాయెద్ రోడ్..!!
- November 10, 2024
యూఏఈ: దుబాయ్ రైడ్లో భాగంగా షేక్ జాయెద్ రోడ్ సైక్లిస్టులతో నిండిపోయింది. అనుభవజ్ఞులైన సైక్లిస్టుల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన స్పీడ్ ల్యాప్స్ ఫీచర్ ఉదయం 5 గంటలకు ప్రారంభమైంది. ఈ ల్యాప్లలో పాల్గొనేవారు దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ నుండి సఫా పార్క్, వెనుకకు వెళ్లే 12 కిమీ షేక్ జాయెద్ రోడ్ రూట్లో ప్రయాణించడానికి సగటున 30కిమీ/గం వేగంతో వెళ్లాల్సి ఉంది. దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్లో భాగంగా షేక్ జాయెద్ రోడ్ను అద్భుతమైన సైక్లింగ్ ట్రాక్గా మార్చారు. గతేడాది ఈ కార్యక్రమంలో 35 వేల మంది పాల్గొన్నారు.
నవంబర్ 10న నిర్వహించిన ఐకానిక్ దుబాయ్ రైడ్ కోసం వేలాది మంది అనుభవజ్ఞులైన, ఔత్సాహిక సైక్లిస్టులు షేక్ జాయెద్ రోడ్కు చేరుకున్నారు. ఈ సంవత్సరం సైక్లింగ్ మెగా ఈవెంట్లో భాగంగా రిజిస్టర్డ్ పార్టిసిపెంట్లకు అందించిన పర్పుల్ టీ-షర్టులను ధరించారు. తెల్లవారుజామున 2 గంటల నుంచే అబుదాబిలో చాలా మంది తరలివెళ్లేవారితో సందడి నెలకొంది. స్పీడ్ ల్యాప్లలో పాల్గొనడానికి వచ్చిన సైక్లిస్టులతో తెల్లవారుజామున 4 గంటల నుంచే హడావుడి నెలకొన్నది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







