గీత రచయిత కన్నదాసన్ మనవడు కథానాయకుడిగా ..

- June 24, 2016 , by Maagulf
గీత రచయిత కన్నదాసన్ మనవడు కథానాయకుడిగా ..

గీత రచయిత కన్నదాసన్ భౌతికంగా లేకపోయినా ఆయన పేరు మాత్రం తమిళ చిత్ర జగతిలో స్థిరస్థాయిగా నిలిచిపోతుంది. అంతటి మహాకవి వారసత్వం కవితారంగంలోకి రాకపోయినా, ఆయన మనవడు కథానాయకుడిగా రాణించడానికి ప్రయత్నించడం ఆహ్వానించదగ్గ విషయం.ఎస్ కన్నదాసన్ మనువడు ఆదవ్‌కన్నదాసన్ ఇప్పటికే పోన్‌మాలైపోళుదు చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యారు. ఆ తరువాత యామెరుక్క భయమే చిత్రంలో నటించి విజయాన్ని అందుకున్నారు.తాజాగా తన తాత 90వ జయంతి సందర్భంగా తన నూతన చిత్రానికి సన్నాహాలు మొదలెట్టారు.ఈ చిత్రానికి వదనమే చంద్రబింబమో అనే టైటిల్‌ను నిర్ణయించారు. శ్రీనివాసన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని ఓం సినిమా సంస్థ నిర్మించనుంది. ముఖ్య పాత్రలో విచారణై చంద్రన్ నటించనున్న ఇందులో ప్రముఖ నాయకితో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం తమిళ చిత్ర పరిశ్రమ, అంతర్జాతీయ సినిమాకు చెందిన వారు నటించనున్నారని చిత్ర యూనిట్ తెలిపారు. శంకర్ టక్కర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ వదనమే చంద్రబింబిమో చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చిత్ర నిర్మాణ నిర్వాహకుడు గోపీక్రి ష్ణన్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com