గీత రచయిత కన్నదాసన్ మనవడు కథానాయకుడిగా ..
- June 24, 2016
గీత రచయిత కన్నదాసన్ భౌతికంగా లేకపోయినా ఆయన పేరు మాత్రం తమిళ చిత్ర జగతిలో స్థిరస్థాయిగా నిలిచిపోతుంది. అంతటి మహాకవి వారసత్వం కవితారంగంలోకి రాకపోయినా, ఆయన మనవడు కథానాయకుడిగా రాణించడానికి ప్రయత్నించడం ఆహ్వానించదగ్గ విషయం.ఎస్ కన్నదాసన్ మనువడు ఆదవ్కన్నదాసన్ ఇప్పటికే పోన్మాలైపోళుదు చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యారు. ఆ తరువాత యామెరుక్క భయమే చిత్రంలో నటించి విజయాన్ని అందుకున్నారు.తాజాగా తన తాత 90వ జయంతి సందర్భంగా తన నూతన చిత్రానికి సన్నాహాలు మొదలెట్టారు.ఈ చిత్రానికి వదనమే చంద్రబింబమో అనే టైటిల్ను నిర్ణయించారు. శ్రీనివాసన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని ఓం సినిమా సంస్థ నిర్మించనుంది. ముఖ్య పాత్రలో విచారణై చంద్రన్ నటించనున్న ఇందులో ప్రముఖ నాయకితో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం తమిళ చిత్ర పరిశ్రమ, అంతర్జాతీయ సినిమాకు చెందిన వారు నటించనున్నారని చిత్ర యూనిట్ తెలిపారు. శంకర్ టక్కర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ వదనమే చంద్రబింబిమో చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చిత్ర నిర్మాణ నిర్వాహకుడు గోపీక్రి ష్ణన్ తెలిపారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









