యూఏఈలో 150శాతం పెరిగిన ఉమ్రా బుకింగ్లు..!!
- November 17, 2024
యూఏఈ: యూఏఈ నుండి అక్టోబర్ , నవంబర్లలో ఉమ్రా బుకింగ్లు పెరిగాయని ట్రావెల్ ఆపరేటర్లు తెలిపారు. వేసవి నెలలతో పోల్చితే 150 శాతం పెరుగుదలను నమోదు అవుతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ సెలవుల కారణంగా డిసెంబర్లో విజట్స్ మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. "శీతాకాలం వచ్చినప్పుడు చాలా మంది నివాసితులు చల్లటి వాతావరణం కారణంగా వారి ఆధ్యాత్మిక ప్రయాణాలను ప్లాన్ చేస్తారు. వేసవిలో ఈ సంఖ్య గణనీయంగా తక్కువగా ఉంటుంది” అని రెహన్ అల్ జజీరా టూరిజంకు చెందిన షిహాబ్ పర్వాద్ చెప్పారు. ప్రస్తుతం, రెహాన్ అల్ జజీరా టూరిజం తరఫున 50 మంది యాత్రికులు ఉమ్రా యాత్రలకు బయలుదేరుతున్నాని, చాలా మంది రోడ్డు ప్రయాణాన్ని ఎంచుకుంటారని, ఇది మొత్తం 10 రోజులు పడుతుందన్నారు. "బస్సులు షార్జా , దుబాయ్ నుండి బయలుదేరుతాయి.యాత్రికులు మక్కాలో మూడు రోజులు, మదీనాలో మూడు రోజులు, మిగిలిన రోజులు ప్రయాణం చేస్తారు" అని పర్వాద్ చెప్పారు. బస్సు ప్రయాణం కోసం ప్యాకేజీలు Dh1,500 నుండి ప్రారంభమవుతాయని, అయితే పరిమిత సీట్లు, వసతి కారణంగా డిసెంబర్లో ఖర్చులు పెరుగుతాయని భావిస్తున్నారు. అదేవిధంగా, విమాన ప్రయాణం మరింత ప్రజాదరణ పొందుతోందని, సమయం తక్కువగా ఉన్న వారికి ఇది మంచి ఎంపికను అందిస్తోందన్నారు. “చాలా మంది ప్రజలు దాని సౌలభ్యం కారణంగా నాలుగు రోజుల ఎయిర్ ప్యాకేజీని ఇష్టపడతారు. ప్రస్తుత ప్యాకేజీ Dh3,000 నుండి మొదలవుతుంది. అయితే విమాన ఛార్జీలు, వసతికి డిమాండ్ పెరగడంతో ధరలు త్వరలో పెరుగుతాయని మేము భావిస్తున్నాము, ”అని ASAA ట్రావెల్స్ నుండి ఖైజర్ మహమూద్ అన్నారు.యూఏఈలో 150శాతం పెరిగిన ఉమ్రా బుకింగ్లు..!!
యూఏఈ: యూఏఈ నుండి అక్టోబర్ , నవంబర్లలో ఉమ్రా బుకింగ్లు పెరిగాయని ట్రావెల్ ఆపరేటర్లు తెలిపారు. వేసవి నెలలతో పోల్చితే 150 శాతం పెరుగుదలను నమోదు అవుతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ సెలవుల కారణంగా డిసెంబర్లో విజట్స్ మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. "శీతాకాలం వచ్చినప్పుడు చాలా మంది నివాసితులు చల్లటి వాతావరణం కారణంగా వారి ఆధ్యాత్మిక ప్రయాణాలను ప్లాన్ చేస్తారు. వేసవిలో ఈ సంఖ్య గణనీయంగా తక్కువగా ఉంటుంది” అని రెహన్ అల్ జజీరా టూరిజంకు చెందిన షిహాబ్ పర్వాద్ చెప్పారు. ప్రస్తుతం, రెహాన్ అల్ జజీరా టూరిజం తరఫున 50 మంది యాత్రికులు ఉమ్రా యాత్రలకు బయలుదేరుతున్నాని, చాలా మంది రోడ్డు ప్రయాణాన్ని ఎంచుకుంటారని, ఇది మొత్తం 10 రోజులు పడుతుందన్నారు. "బస్సులు షార్జా , దుబాయ్ నుండి బయలుదేరుతాయి.యాత్రికులు మక్కాలో మూడు రోజులు, మదీనాలో మూడు రోజులు, మిగిలిన రోజులు ప్రయాణం చేస్తారు" అని పర్వాద్ చెప్పారు. బస్సు ప్రయాణం కోసం ప్యాకేజీలు Dh1,500 నుండి ప్రారంభమవుతాయని, అయితే పరిమిత సీట్లు, వసతి కారణంగా డిసెంబర్లో ఖర్చులు పెరుగుతాయని భావిస్తున్నారు. అదేవిధంగా, విమాన ప్రయాణం మరింత ప్రజాదరణ పొందుతోందని, సమయం తక్కువగా ఉన్న వారికి ఇది మంచి ఎంపికను అందిస్తోందన్నారు. “చాలా మంది ప్రజలు దాని సౌలభ్యం కారణంగా నాలుగు రోజుల ఎయిర్ ప్యాకేజీని ఇష్టపడతారు. ప్రస్తుత ప్యాకేజీ Dh3,000 నుండి మొదలవుతుంది. అయితే విమాన ఛార్జీలు, వసతికి డిమాండ్ పెరగడంతో ధరలు త్వరలో పెరుగుతాయని మేము భావిస్తున్నాము, ”అని ASAA ట్రావెల్స్ నుండి ఖైజర్ మహమూద్ అన్నారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







