యూఏఈలో 150శాతం పెరిగిన ఉమ్రా బుకింగ్లు..!!
- November 17, 2024
యూఏఈ: యూఏఈ నుండి అక్టోబర్ , నవంబర్లలో ఉమ్రా బుకింగ్లు పెరిగాయని ట్రావెల్ ఆపరేటర్లు తెలిపారు. వేసవి నెలలతో పోల్చితే 150 శాతం పెరుగుదలను నమోదు అవుతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ సెలవుల కారణంగా డిసెంబర్లో విజట్స్ మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. "శీతాకాలం వచ్చినప్పుడు చాలా మంది నివాసితులు చల్లటి వాతావరణం కారణంగా వారి ఆధ్యాత్మిక ప్రయాణాలను ప్లాన్ చేస్తారు. వేసవిలో ఈ సంఖ్య గణనీయంగా తక్కువగా ఉంటుంది” అని రెహన్ అల్ జజీరా టూరిజంకు చెందిన షిహాబ్ పర్వాద్ చెప్పారు. ప్రస్తుతం, రెహాన్ అల్ జజీరా టూరిజం తరఫున 50 మంది యాత్రికులు ఉమ్రా యాత్రలకు బయలుదేరుతున్నాని, చాలా మంది రోడ్డు ప్రయాణాన్ని ఎంచుకుంటారని, ఇది మొత్తం 10 రోజులు పడుతుందన్నారు. "బస్సులు షార్జా , దుబాయ్ నుండి బయలుదేరుతాయి.యాత్రికులు మక్కాలో మూడు రోజులు, మదీనాలో మూడు రోజులు, మిగిలిన రోజులు ప్రయాణం చేస్తారు" అని పర్వాద్ చెప్పారు. బస్సు ప్రయాణం కోసం ప్యాకేజీలు Dh1,500 నుండి ప్రారంభమవుతాయని, అయితే పరిమిత సీట్లు, వసతి కారణంగా డిసెంబర్లో ఖర్చులు పెరుగుతాయని భావిస్తున్నారు. అదేవిధంగా, విమాన ప్రయాణం మరింత ప్రజాదరణ పొందుతోందని, సమయం తక్కువగా ఉన్న వారికి ఇది మంచి ఎంపికను అందిస్తోందన్నారు. “చాలా మంది ప్రజలు దాని సౌలభ్యం కారణంగా నాలుగు రోజుల ఎయిర్ ప్యాకేజీని ఇష్టపడతారు. ప్రస్తుత ప్యాకేజీ Dh3,000 నుండి మొదలవుతుంది. అయితే విమాన ఛార్జీలు, వసతికి డిమాండ్ పెరగడంతో ధరలు త్వరలో పెరుగుతాయని మేము భావిస్తున్నాము, ”అని ASAA ట్రావెల్స్ నుండి ఖైజర్ మహమూద్ అన్నారు.యూఏఈలో 150శాతం పెరిగిన ఉమ్రా బుకింగ్లు..!!
యూఏఈ: యూఏఈ నుండి అక్టోబర్ , నవంబర్లలో ఉమ్రా బుకింగ్లు పెరిగాయని ట్రావెల్ ఆపరేటర్లు తెలిపారు. వేసవి నెలలతో పోల్చితే 150 శాతం పెరుగుదలను నమోదు అవుతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ సెలవుల కారణంగా డిసెంబర్లో విజట్స్ మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. "శీతాకాలం వచ్చినప్పుడు చాలా మంది నివాసితులు చల్లటి వాతావరణం కారణంగా వారి ఆధ్యాత్మిక ప్రయాణాలను ప్లాన్ చేస్తారు. వేసవిలో ఈ సంఖ్య గణనీయంగా తక్కువగా ఉంటుంది” అని రెహన్ అల్ జజీరా టూరిజంకు చెందిన షిహాబ్ పర్వాద్ చెప్పారు. ప్రస్తుతం, రెహాన్ అల్ జజీరా టూరిజం తరఫున 50 మంది యాత్రికులు ఉమ్రా యాత్రలకు బయలుదేరుతున్నాని, చాలా మంది రోడ్డు ప్రయాణాన్ని ఎంచుకుంటారని, ఇది మొత్తం 10 రోజులు పడుతుందన్నారు. "బస్సులు షార్జా , దుబాయ్ నుండి బయలుదేరుతాయి.యాత్రికులు మక్కాలో మూడు రోజులు, మదీనాలో మూడు రోజులు, మిగిలిన రోజులు ప్రయాణం చేస్తారు" అని పర్వాద్ చెప్పారు. బస్సు ప్రయాణం కోసం ప్యాకేజీలు Dh1,500 నుండి ప్రారంభమవుతాయని, అయితే పరిమిత సీట్లు, వసతి కారణంగా డిసెంబర్లో ఖర్చులు పెరుగుతాయని భావిస్తున్నారు. అదేవిధంగా, విమాన ప్రయాణం మరింత ప్రజాదరణ పొందుతోందని, సమయం తక్కువగా ఉన్న వారికి ఇది మంచి ఎంపికను అందిస్తోందన్నారు. “చాలా మంది ప్రజలు దాని సౌలభ్యం కారణంగా నాలుగు రోజుల ఎయిర్ ప్యాకేజీని ఇష్టపడతారు. ప్రస్తుత ప్యాకేజీ Dh3,000 నుండి మొదలవుతుంది. అయితే విమాన ఛార్జీలు, వసతికి డిమాండ్ పెరగడంతో ధరలు త్వరలో పెరుగుతాయని మేము భావిస్తున్నాము, ”అని ASAA ట్రావెల్స్ నుండి ఖైజర్ మహమూద్ అన్నారు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







