ఒమాన్ నేషనల్ డే సందర్భంగా 174 మంది ప్రవాస ఖైదీలకు క్షమాభిక్ష
- November 17, 2024
మస్కట్: ఒమన్ యొక్క 54వ జాతీయ దినోత్సవం సందర్భంగా ఒమాన్ సుప్రీం కమాండర్ హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ 174 మంది ప్రవాస ఖైదీలకు క్షమాభిక్షను ప్రసాదించారు. ఒమాన్ జాతీయ దినోత్సవ వేడుకల నేపథ్యంలో సుల్తాన్ హైతం బిన్ తారిక్ తనకు ప్రజల పట్ల ఉన్న దయ, కరుణ మరియు సానుభూతిని ఈ క్షమాబిక్ష ద్వారా వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వివిధ నేరాలకు పాల్పడిన వ్యక్తులకు రాయల్ ఒమన్ పోలీసులు క్షమాపణ ప్రకటించారు.
ఈ క్షమాభిక్షను పొందిన ఖైదీలు తమ కుటుంబాలతో తిరిగి కలుసుకోవడానికి, సమాజంలో తిరిగి స్థిరపడడానికి సహాయపడుతుంది.ఈ చర్య ఒమన్ యొక్క శాంతి సామరస్యాన్ని పెంపొందించడంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఖైదీలకు ఈ రాయల్ క్షమాభిక్ష వారి జీవితాలను సరికొత్త దిశలో తీసుకెళ్లడానికి ఒక అవకాశం కల్పిస్తుంది.
--వేణు_పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









