ఒమాన్ నేషనల్ డే సందర్భంగా 174 మంది ప్రవాస ఖైదీలకు క్షమాభిక్ష
- November 17, 2024
మస్కట్: ఒమన్ యొక్క 54వ జాతీయ దినోత్సవం సందర్భంగా ఒమాన్ సుప్రీం కమాండర్ హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ 174 మంది ప్రవాస ఖైదీలకు క్షమాభిక్షను ప్రసాదించారు. ఒమాన్ జాతీయ దినోత్సవ వేడుకల నేపథ్యంలో సుల్తాన్ హైతం బిన్ తారిక్ తనకు ప్రజల పట్ల ఉన్న దయ, కరుణ మరియు సానుభూతిని ఈ క్షమాబిక్ష ద్వారా వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వివిధ నేరాలకు పాల్పడిన వ్యక్తులకు రాయల్ ఒమన్ పోలీసులు క్షమాపణ ప్రకటించారు.
ఈ క్షమాభిక్షను పొందిన ఖైదీలు తమ కుటుంబాలతో తిరిగి కలుసుకోవడానికి, సమాజంలో తిరిగి స్థిరపడడానికి సహాయపడుతుంది.ఈ చర్య ఒమన్ యొక్క శాంతి సామరస్యాన్ని పెంపొందించడంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఖైదీలకు ఈ రాయల్ క్షమాభిక్ష వారి జీవితాలను సరికొత్త దిశలో తీసుకెళ్లడానికి ఒక అవకాశం కల్పిస్తుంది.
--వేణు_పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్, పురందేశ్వరి భావోద్వేగ నివాళులు
- న్యూఢిల్లీలో ‘అప్నాపన్’ పుస్తకావిష్కరణలో పాల్గొన్న వెంకయ్య నాయుడు
- మహానాడు తొలిరోజు విజయవంతమైందన్న సీఎం చంద్రబాబు
- బక్రీద్ సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు
- సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీపీ సుమతి
- మెడికవర్ హైటెక్ సిటీలో అత్యాధునిక ER-SSU యూనిట్ ప్రారంభం
- రాజస్థాన్లో ఘోర ప్రమాదం..నలుగురు సజీవ దహనం!
- కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్: సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా!
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!









