UAE భారతీయ కమ్యూనిటీతో కలిసి దీపావళిని జరుపుకున్న నహ్యాన్ బిన్ ముబారక్
- November 17, 2024
యూఏఈ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లోని భారతీయ కమ్యూనిటీ దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకుంది. ఈ వేడుకలకు యూఏఈ మంత్రి నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో ఆయనతో పాటు భారత రాయబారి సుంజయ్ సుధీర్ మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. దుబాయ్ లోని జబీల్ పార్క్ లో జరిగిన ఈ వేడుకల్లో దాదాపు 60,000 మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు.
యూఏఈ ప్రభుత్వ మీడియా కార్యాలయం మరియు దుబాయ్ పోలీస్ ఈ కార్యక్రమానికి మద్దతు అందించిన ఈ కార్యక్రమం “ఎమిరేట్స్ లవ్స్ ఇండియా” అనే సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ వేడుకలో భారతీయ సాంస్కృతిక వారసత్వం, కళలు, సంగీతం, మరియు ఫోక్లోర్ ప్రదర్శనలు కనువిందు చేశాయి.
ఈ సందర్భంగా నహ్యాన్ బిన్ ముబారక్ మాట్లాడుతూ ఈ వేడుకల ద్వారా యూఏఈ మరియు భారతదేశం మధ్య ఉన్న స్నేహ సంబంధాలు మరింత మెరుగుపడతాయని ఆయన ఆశ భావం వ్యక్తం చేశారు. ఇంకా ఆయన దీపావళి పండుగను విశిష్టత తెలియజేస్తూ “అంధకారంపై వెలుగుల విజయం, అజ్ఞానంపై జ్ఞాన విజయం, చెడుపై మంచి విజయం, మరియు సంఘర్షణపై శాంతి విజయం” గా వర్ణించారు.
ఈ వేడుకలో భారతీయ సమాజానికి చెందిన ప్రముఖులను ఆయన సత్కరించారు. వీరిలో డాక్టర్ సురేందర్ సింగ్ కంద్హారి, నిషా జాగ్టియాని, సిద్ధార్థ్ బాలచంద్రన్, రిజ్వాన్ సజాన్, మరియు అతిఫ్ రహ్మాన్ ఉన్నారు. ఈ కార్యక్రమం భారతీయ సమాజం మరియు యూఏఈ మధ్య ఉన్న బలమైన సంబంధాలను ప్రతిబింబించింది.ఈ విధంగా, యూఏఈ లోని భారతీయ కమ్యూనిటీ దీపావళి పండుగను ఘనంగా జరుపుకోవడం ద్వారా తమ సాంస్కృతిక వారసత్వాన్ని మరియు యూఏఈ తో ఉన్న స్నేహ సంబంధాలను మరింత బలపరిచింది.
--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







