దుబాయ్ లో డ్రగ్స్ స్మగ్లింగ్.. వ్యక్తికి జీవిత ఖైదు..!!
- November 17, 2024
దుబాయ్: దుబాయిలో సైకోట్రోపిక్ పదార్ధాల అక్రమ రవాణా కేసులో దోషిగా నిర్ధారించబడిన ఒక వ్యక్తికి దుబాయ్లోని క్రిమినల్ కోర్ట్ జీవిత ఖైదు విధించింది. ఎమిరేట్స్ లో జీవిత ఖైదు సాధారణంగా 25 సంవత్సరాలు ఉంటుంది. దీంతో పాటు 47 ఏళ్ల మలేషియా జాతీయుడికి Dh200,000 జరిమానా విధించారు. అతని జైలు శిక్ష పూర్తయిన దేశం నుండి బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది. డిసెంబర్ 15, 2023 నవిమానాశ్రయ అధికారులు బెల్జియం నుండి షిప్మెంట్ లో వాటర్ ఫిల్టర్లో దాచిన 2,892 గ్రాముల తెల్లటి పొడిని గుర్తించారు. ఆ తర్వాత, దక్షిణాఫ్రికా నుండి ఫిబ్రవరి 28, 2024న రెండవ షిప్మెంట్ వచ్చింది. ఈసారి "కాఫీ, చాక్లెట్, స్వీట్స్" అని లేబుల్ చేయబడిన ప్యాకేజీగా ఉంది. నాలుగు ప్లాస్టిక్ కంటైనర్లలో బ్రౌన్ పౌడర్ కింద దాచిపెట్టిన సుమారు 3,638 గ్రాముల తెల్లటి పొడిని తనిఖీల్లో గుర్తించారు. ఫోరెన్సిక్ విశ్లేషణ లో అది కెటామైన్ పదార్తంగా నిర్ధారించారు. మార్చి 19, 2024న నిందితుడు రెండవ షిప్మెంట్ను సేకరించడానికి దుబాయ్లోని అరామెక్స్ అల్ జహ్రా బ్రాంచ్కు రాగా, కస్టమ్స్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీపీ సుమతి
- మెడికవర్ హైటెక్ సిటీలో అత్యాధునిక ER-SSU యూనిట్ ప్రారంభం
- రాజస్థాన్లో ఘోర ప్రమాదం..నలుగురు సజీవ దహనం!
- కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్: సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా!
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!









