దుబాయ్ లో డ్రగ్స్ స్మగ్లింగ్.. వ్యక్తికి జీవిత ఖైదు..!!
- November 17, 2024
దుబాయ్: దుబాయిలో సైకోట్రోపిక్ పదార్ధాల అక్రమ రవాణా కేసులో దోషిగా నిర్ధారించబడిన ఒక వ్యక్తికి దుబాయ్లోని క్రిమినల్ కోర్ట్ జీవిత ఖైదు విధించింది. ఎమిరేట్స్ లో జీవిత ఖైదు సాధారణంగా 25 సంవత్సరాలు ఉంటుంది. దీంతో పాటు 47 ఏళ్ల మలేషియా జాతీయుడికి Dh200,000 జరిమానా విధించారు. అతని జైలు శిక్ష పూర్తయిన దేశం నుండి బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది. డిసెంబర్ 15, 2023 నవిమానాశ్రయ అధికారులు బెల్జియం నుండి షిప్మెంట్ లో వాటర్ ఫిల్టర్లో దాచిన 2,892 గ్రాముల తెల్లటి పొడిని గుర్తించారు. ఆ తర్వాత, దక్షిణాఫ్రికా నుండి ఫిబ్రవరి 28, 2024న రెండవ షిప్మెంట్ వచ్చింది. ఈసారి "కాఫీ, చాక్లెట్, స్వీట్స్" అని లేబుల్ చేయబడిన ప్యాకేజీగా ఉంది. నాలుగు ప్లాస్టిక్ కంటైనర్లలో బ్రౌన్ పౌడర్ కింద దాచిపెట్టిన సుమారు 3,638 గ్రాముల తెల్లటి పొడిని తనిఖీల్లో గుర్తించారు. ఫోరెన్సిక్ విశ్లేషణ లో అది కెటామైన్ పదార్తంగా నిర్ధారించారు. మార్చి 19, 2024న నిందితుడు రెండవ షిప్మెంట్ను సేకరించడానికి దుబాయ్లోని అరామెక్స్ అల్ జహ్రా బ్రాంచ్కు రాగా, కస్టమ్స్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!







