దుబాయ్ లో డ్రగ్స్ స్మగ్లింగ్.. వ్యక్తికి జీవిత ఖైదు..!!
- November 17, 2024
దుబాయ్: దుబాయిలో సైకోట్రోపిక్ పదార్ధాల అక్రమ రవాణా కేసులో దోషిగా నిర్ధారించబడిన ఒక వ్యక్తికి దుబాయ్లోని క్రిమినల్ కోర్ట్ జీవిత ఖైదు విధించింది. ఎమిరేట్స్ లో జీవిత ఖైదు సాధారణంగా 25 సంవత్సరాలు ఉంటుంది. దీంతో పాటు 47 ఏళ్ల మలేషియా జాతీయుడికి Dh200,000 జరిమానా విధించారు. అతని జైలు శిక్ష పూర్తయిన దేశం నుండి బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది. డిసెంబర్ 15, 2023 నవిమానాశ్రయ అధికారులు బెల్జియం నుండి షిప్మెంట్ లో వాటర్ ఫిల్టర్లో దాచిన 2,892 గ్రాముల తెల్లటి పొడిని గుర్తించారు. ఆ తర్వాత, దక్షిణాఫ్రికా నుండి ఫిబ్రవరి 28, 2024న రెండవ షిప్మెంట్ వచ్చింది. ఈసారి "కాఫీ, చాక్లెట్, స్వీట్స్" అని లేబుల్ చేయబడిన ప్యాకేజీగా ఉంది. నాలుగు ప్లాస్టిక్ కంటైనర్లలో బ్రౌన్ పౌడర్ కింద దాచిపెట్టిన సుమారు 3,638 గ్రాముల తెల్లటి పొడిని తనిఖీల్లో గుర్తించారు. ఫోరెన్సిక్ విశ్లేషణ లో అది కెటామైన్ పదార్తంగా నిర్ధారించారు. మార్చి 19, 2024న నిందితుడు రెండవ షిప్మెంట్ను సేకరించడానికి దుబాయ్లోని అరామెక్స్ అల్ జహ్రా బ్రాంచ్కు రాగా, కస్టమ్స్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









