దుబాయ్ లో 1,800 స్కూటర్లు సీజ్..!!
- November 19, 2024
దుబాయ్: దుబాయ్ లో నిర్వహించిన ట్రాఫిక్ సేఫ్టీ ప్రచారంలో భాగంగా దుబాయ్ పోలీసులు 1,780 స్కూటర్లు, సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. అల్ రిఫా పోలీస్ స్టేషన్తో కలిసి అధికార యంత్రాంగం నిర్వహించిన ప్రచారం అల్ రిఫా అధికార పరిధిలో 1,417 సైకిళ్లు, 363 ఎలక్ట్రిక్ స్కూటర్లు, సైకిళ్లను జప్తు చేసింది. పబ్లిక్ రోడ్లు, పాదచారుల మార్గాలు వంటి నిషేధ ప్రదేశాలలో స్కూటర్లు, సైకిళ్లను ఉపయోగించడం, ఇతరులకు ప్రమాదాన్ని కలిగించడం,
హెల్మెట్ ధరించకపోవడం, ట్రాఫిక్ సిగ్నల్లను పట్టించుకోకపోవడం, రిఫ్లెక్టివ్ దుస్తులు, సరైన లైటింగ్ వంటి ముఖ్యమైన భద్రతా ఫీచర్లు పాటించకపోవడం వంటి ఉల్లంఘనలకు సంబంధించి 251 జరిమానాలను కూడా జారీ చేసినట్టు అథారిటీ తెలిపింది. దుబాయ్ పోలీస్ యాప్లోని 'పోలీస్ ఐ' సేవ ద్వారా లేదా 901కు 'వి ఆర్ ఆల్ పోలీస్' హాట్లైన్కు కాల్ చేయడం ద్వారా ఫిర్యాదు చేయాలని అధికార యంత్రాంగం ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









