దుబాయ్ లో 1,800 స్కూటర్లు సీజ్..!!
- November 19, 2024
దుబాయ్: దుబాయ్ లో నిర్వహించిన ట్రాఫిక్ సేఫ్టీ ప్రచారంలో భాగంగా దుబాయ్ పోలీసులు 1,780 స్కూటర్లు, సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. అల్ రిఫా పోలీస్ స్టేషన్తో కలిసి అధికార యంత్రాంగం నిర్వహించిన ప్రచారం అల్ రిఫా అధికార పరిధిలో 1,417 సైకిళ్లు, 363 ఎలక్ట్రిక్ స్కూటర్లు, సైకిళ్లను జప్తు చేసింది. పబ్లిక్ రోడ్లు, పాదచారుల మార్గాలు వంటి నిషేధ ప్రదేశాలలో స్కూటర్లు, సైకిళ్లను ఉపయోగించడం, ఇతరులకు ప్రమాదాన్ని కలిగించడం,
హెల్మెట్ ధరించకపోవడం, ట్రాఫిక్ సిగ్నల్లను పట్టించుకోకపోవడం, రిఫ్లెక్టివ్ దుస్తులు, సరైన లైటింగ్ వంటి ముఖ్యమైన భద్రతా ఫీచర్లు పాటించకపోవడం వంటి ఉల్లంఘనలకు సంబంధించి 251 జరిమానాలను కూడా జారీ చేసినట్టు అథారిటీ తెలిపింది. దుబాయ్ పోలీస్ యాప్లోని 'పోలీస్ ఐ' సేవ ద్వారా లేదా 901కు 'వి ఆర్ ఆల్ పోలీస్' హాట్లైన్కు కాల్ చేయడం ద్వారా ఫిర్యాదు చేయాలని అధికార యంత్రాంగం ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..







