దుబాయ్ లో 1,800 స్కూటర్లు సీజ్..!!
- November 19, 2024
దుబాయ్: దుబాయ్ లో నిర్వహించిన ట్రాఫిక్ సేఫ్టీ ప్రచారంలో భాగంగా దుబాయ్ పోలీసులు 1,780 స్కూటర్లు, సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. అల్ రిఫా పోలీస్ స్టేషన్తో కలిసి అధికార యంత్రాంగం నిర్వహించిన ప్రచారం అల్ రిఫా అధికార పరిధిలో 1,417 సైకిళ్లు, 363 ఎలక్ట్రిక్ స్కూటర్లు, సైకిళ్లను జప్తు చేసింది. పబ్లిక్ రోడ్లు, పాదచారుల మార్గాలు వంటి నిషేధ ప్రదేశాలలో స్కూటర్లు, సైకిళ్లను ఉపయోగించడం, ఇతరులకు ప్రమాదాన్ని కలిగించడం,
హెల్మెట్ ధరించకపోవడం, ట్రాఫిక్ సిగ్నల్లను పట్టించుకోకపోవడం, రిఫ్లెక్టివ్ దుస్తులు, సరైన లైటింగ్ వంటి ముఖ్యమైన భద్రతా ఫీచర్లు పాటించకపోవడం వంటి ఉల్లంఘనలకు సంబంధించి 251 జరిమానాలను కూడా జారీ చేసినట్టు అథారిటీ తెలిపింది. దుబాయ్ పోలీస్ యాప్లోని 'పోలీస్ ఐ' సేవ ద్వారా లేదా 901కు 'వి ఆర్ ఆల్ పోలీస్' హాట్లైన్కు కాల్ చేయడం ద్వారా ఫిర్యాదు చేయాలని అధికార యంత్రాంగం ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్లో ఫైర్సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







