RAK బీచ్లో ముగ్గురిని సేఫ్ చేసిన సిటిజన్స్..!!
- November 19, 2024
యూఏఈ: రస్ అల్ ఖైమాలోని బీచ్ వద్ద ముగ్గురు యువకులను స్థానికులు రక్షించారు. చేపలు పడుతుండగా ఉవ్వెత్తున ఎగిసిన అలల కారణంగా ఒడ్డుకు చేరుకోలేక పోయామని యువకుల్లో ఒకరు తెలిపారు. సమాచారం అందుకున్న రస్ అల్ ఖైమా పోలీసులు.. సెర్చ్ అండ్ రెస్క్యూ డిపార్ట్మెంట్ సంఘటనా స్థలానికి చేరుకునే లోపే, అక్కడ ఉన్న స్థానికులు ముగ్గురు వ్యక్తులను రక్షించి సురక్షితంగా బీచ్కు తీసుకువచ్చారు. ప్రాణాలతో బయటపడిన ముగ్గురికి అధికార యంత్రాంగం వైద్యపరీక్షలు నిర్వహించింది. ఈ సందర్భంగా యువకులను రక్షించిన ప్రజల సహకారాన్ని పోలీసులు ప్రశంసించారు. చేపలు పట్టేటప్పుడు లేదా ఈత కొట్టేటప్పుడు సముద్ర ఆటుపోట్లపై జాగ్రత్తలు తీసుకోవాలని అధికార యంత్రాంగం ప్రజలకు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







