RAK బీచ్లో ముగ్గురిని సేఫ్ చేసిన సిటిజన్స్..!!
- November 19, 2024
యూఏఈ: రస్ అల్ ఖైమాలోని బీచ్ వద్ద ముగ్గురు యువకులను స్థానికులు రక్షించారు. చేపలు పడుతుండగా ఉవ్వెత్తున ఎగిసిన అలల కారణంగా ఒడ్డుకు చేరుకోలేక పోయామని యువకుల్లో ఒకరు తెలిపారు. సమాచారం అందుకున్న రస్ అల్ ఖైమా పోలీసులు.. సెర్చ్ అండ్ రెస్క్యూ డిపార్ట్మెంట్ సంఘటనా స్థలానికి చేరుకునే లోపే, అక్కడ ఉన్న స్థానికులు ముగ్గురు వ్యక్తులను రక్షించి సురక్షితంగా బీచ్కు తీసుకువచ్చారు. ప్రాణాలతో బయటపడిన ముగ్గురికి అధికార యంత్రాంగం వైద్యపరీక్షలు నిర్వహించింది. ఈ సందర్భంగా యువకులను రక్షించిన ప్రజల సహకారాన్ని పోలీసులు ప్రశంసించారు. చేపలు పట్టేటప్పుడు లేదా ఈత కొట్టేటప్పుడు సముద్ర ఆటుపోట్లపై జాగ్రత్తలు తీసుకోవాలని అధికార యంత్రాంగం ప్రజలకు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









