ఒకే రోజు 10 కొత్త గమ్యస్థానాలను ప్రకటించనున్న ఎతిహాద్..!!

- November 19, 2024 , by Maagulf
ఒకే రోజు 10 కొత్త గమ్యస్థానాలను ప్రకటించనున్న ఎతిహాద్..!!

యూఏఈ: ఎతిహాద్ ఎయిర్‌వేస్ తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో భాగంగా ఒకే రోజు పది కొత్త గమ్యస్థానాలకు విస్తరించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించింది. నవంబర్ 25న లొకేషన్‌లను వెల్లడించనుంది. ఇది వృద్ధి, కస్టమర్ సర్వీస్ ఎక్సలెన్స్ పట్ల నిబద్ధతతో కొనసాగుతున్న తమ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని తెలిపింది. 
ప్రస్తుతం, ఎతిహాద్ 83 గమ్యస్థానాలకు సర్వీసులను నడుపుతుంది. 10 కొత్త గమ్యస్థానాలతో కలిపి మొత్తం నగరాల సంఖ్య 93కి చేరుకోనుందని ఎతిహాద్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆంటోనోల్డో నెవ్స్ తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com