ఎమిరటైజేషన్ విధానాల ఉల్లంఘన..1,900 ప్రైవేట్ సంస్థలకు భారీగా జరిమానా..!!
- November 21, 2024
యూఏఈ: 2022 మధ్య నుండి 2024,19 నవంబర్ వరకు 1,934 ప్రైవేట్ కంపెనీలు ఎమిరేటైజేషన్ విధానాలను ఉల్లంఘించినట్లు గుర్తించినట్లు యూఏఈ అథారిటీ ప్రకటించింది. లక్ష్యాలను చేధించేందుకు ఈ కంపెనీలు విధానాలను ఉల్లంఘించి నకిలీ ఎమిరేటైజేషన్లో 3,035 మంది యూఏఈ పౌరులను నియమించుకున్నాయని మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో, 22,000 కంటే ఎక్కువ ప్రైవేట్ సంస్థలు అదే కాలంలో ఎమిరాటీస్ విధానాలకు అనుగుణంగా ఎమిరాటీలను నియమించుకున్నాయని తెలిపింది.
ఎమిరేటైజేషన్ బాధ్యతల నుండి తప్పించుకోవడానికి ఏవైనా ప్రయత్నాలు చేస్తే కఠినంగా, చట్టానికి అనుగుణంగా వ్యవహరిస్తామని అథారిటీ తెలిపింది. ఉల్లంఘించిన సంస్థలపై Dh20,000 నుంచి Dh500,000 మధ్య జరిమానా విధించనున్నట్లు తెలిపింది. కేసు తీవ్రతను బట్టి, ఉల్లంఘించిన కంపెనీ పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేస్తామన్నారు. డిసెంబరు చివరి నాటికి తమ 2024 ఎమిరేటైజేషన్ లక్ష్యాలను చేరుకోవాలని అథారిటీ ఇటీవల ప్రైవేట్ రంగ కంపెనీలకు అలెర్ట్ జారీ చేసింది. నిబంధనలకు అనుగుణంగా లేని సంస్థలు జనవరి 1, 2025 నుండి భారీ జరిమానాలు చెల్లించవలసి ఉంటుందని స్పష్టం చేసింది. కాల్ సెంటర్కు 600590000 లేదా మంత్రిత్వ శాఖ స్మార్ట్ యాప్ మరియు వెబ్సైట్ ద్వారా ఫిర్యాదులు చేయాలని అథారిటీ కోరింది.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







