ఎమిరటైజేషన్ విధానాల ఉల్లంఘన..1,900 ప్రైవేట్ సంస్థలకు భారీగా జరిమానా..!!
- November 21, 2024
యూఏఈ: 2022 మధ్య నుండి 2024,19 నవంబర్ వరకు 1,934 ప్రైవేట్ కంపెనీలు ఎమిరేటైజేషన్ విధానాలను ఉల్లంఘించినట్లు గుర్తించినట్లు యూఏఈ అథారిటీ ప్రకటించింది. లక్ష్యాలను చేధించేందుకు ఈ కంపెనీలు విధానాలను ఉల్లంఘించి నకిలీ ఎమిరేటైజేషన్లో 3,035 మంది యూఏఈ పౌరులను నియమించుకున్నాయని మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో, 22,000 కంటే ఎక్కువ ప్రైవేట్ సంస్థలు అదే కాలంలో ఎమిరాటీస్ విధానాలకు అనుగుణంగా ఎమిరాటీలను నియమించుకున్నాయని తెలిపింది.
ఎమిరేటైజేషన్ బాధ్యతల నుండి తప్పించుకోవడానికి ఏవైనా ప్రయత్నాలు చేస్తే కఠినంగా, చట్టానికి అనుగుణంగా వ్యవహరిస్తామని అథారిటీ తెలిపింది. ఉల్లంఘించిన సంస్థలపై Dh20,000 నుంచి Dh500,000 మధ్య జరిమానా విధించనున్నట్లు తెలిపింది. కేసు తీవ్రతను బట్టి, ఉల్లంఘించిన కంపెనీ పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేస్తామన్నారు. డిసెంబరు చివరి నాటికి తమ 2024 ఎమిరేటైజేషన్ లక్ష్యాలను చేరుకోవాలని అథారిటీ ఇటీవల ప్రైవేట్ రంగ కంపెనీలకు అలెర్ట్ జారీ చేసింది. నిబంధనలకు అనుగుణంగా లేని సంస్థలు జనవరి 1, 2025 నుండి భారీ జరిమానాలు చెల్లించవలసి ఉంటుందని స్పష్టం చేసింది. కాల్ సెంటర్కు 600590000 లేదా మంత్రిత్వ శాఖ స్మార్ట్ యాప్ మరియు వెబ్సైట్ ద్వారా ఫిర్యాదులు చేయాలని అథారిటీ కోరింది.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









