పాకిస్తాన్: ఉగ్ర నరమేధం..38 మంది దుర్మరణం
- November 21, 2024
పాకిస్తాన్: పాకిస్తాన్లో దారుణం చోటుచేసుకుంది. ఖైబర్ ఫంఖ్తువా ప్రావిన్సులోని కుర్రం జిల్లాలో ప్రయాణికుల వాహనాలపై సాయుధ దుండగులు కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో 38మంది మరణించగా, 29 మంది గాయపడ్డారు. మృతులలో ఆరుగురు మహిళలు, పలువురు చిన్నారులు ఉన్నట్లు పోలీసు అధికారులు ధ్రువీకరించారు. ఇటీవలి నెలల్లో డజన్ల కొద్దీ ప్రాణాలను బలిగొన్న మతపరమైన హింసతో ఈ సంఘటనలు ముడిపడి ఉన్నాయని అధికారులు తెలిపారు.
‘షియా ప్రజల రెండు వేర్వేరు కాన్వాయిలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారని సీనియర్ అడ్మినిస్ట్రేషన్ అధికారి జావేద్ ఉల్లా మెహసూద్ చెప్పారు. రెండు సంఘటనలలో సుమారు 10 మంది దుండగులు పాల్గొన్నట్లు సమాచారం. రెండు కాన్వాయ్లలో దాదాపు 40 వాహనాలు పోలీసు ఎస్కార్ట్లో ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది.
వాయువ్య ఖైబర్ ఫఖ్తువా ప్రావిన్స్లోని కుర్రమ్లో సున్నీ, షియా ముస్లిం తెగలు తరచూ పరస్పర ఘర్షణలకు పాల్పడుతుంటాయి. అక్టోబర్లో జరిగిన మత ఘర్షణలో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు సహా కనీసం 16 మంది చనిపోయారు. జులై, సెప్టెంబరులోనూ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. డజన్ల సంఖ్యలో ప్రజలు చనిపోయారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!









