పాకిస్తాన్: ఉగ్ర నరమేధం..38 మంది దుర్మరణం
- November 21, 2024
పాకిస్తాన్: పాకిస్తాన్లో దారుణం చోటుచేసుకుంది. ఖైబర్ ఫంఖ్తువా ప్రావిన్సులోని కుర్రం జిల్లాలో ప్రయాణికుల వాహనాలపై సాయుధ దుండగులు కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో 38మంది మరణించగా, 29 మంది గాయపడ్డారు. మృతులలో ఆరుగురు మహిళలు, పలువురు చిన్నారులు ఉన్నట్లు పోలీసు అధికారులు ధ్రువీకరించారు. ఇటీవలి నెలల్లో డజన్ల కొద్దీ ప్రాణాలను బలిగొన్న మతపరమైన హింసతో ఈ సంఘటనలు ముడిపడి ఉన్నాయని అధికారులు తెలిపారు.
‘షియా ప్రజల రెండు వేర్వేరు కాన్వాయిలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారని సీనియర్ అడ్మినిస్ట్రేషన్ అధికారి జావేద్ ఉల్లా మెహసూద్ చెప్పారు. రెండు సంఘటనలలో సుమారు 10 మంది దుండగులు పాల్గొన్నట్లు సమాచారం. రెండు కాన్వాయ్లలో దాదాపు 40 వాహనాలు పోలీసు ఎస్కార్ట్లో ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది.
వాయువ్య ఖైబర్ ఫఖ్తువా ప్రావిన్స్లోని కుర్రమ్లో సున్నీ, షియా ముస్లిం తెగలు తరచూ పరస్పర ఘర్షణలకు పాల్పడుతుంటాయి. అక్టోబర్లో జరిగిన మత ఘర్షణలో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు సహా కనీసం 16 మంది చనిపోయారు. జులై, సెప్టెంబరులోనూ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. డజన్ల సంఖ్యలో ప్రజలు చనిపోయారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







