మరోసారి రెఫరెండం కోసం డిమాండ్..
- June 25, 2016
యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పలు ప్రాంతాలకు చెందిన ఆ దేశ వాసులు రెండో రెఫరెండం కోసం డిమాండ్ చేస్తున్నారు. ఇందు కోసం ఓ వెబ్సైట్లో పెట్టిన పిటిషన్పై సంతకాలు చేసిన వారి సంఖ్య ఒక మిలియన్ దాటింది. సంతకాలు చేసిన వారిలో ఎక్కువగా లండన్, బ్రిగ్టన్, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, మాంచెస్టర్ నుంచి ఉన్నారు. వీరంతా బ్రెగ్జిట్కు వ్యతిరేకంగా ఓటు వేసినవారే.
ఒక మిలియన్ సంతకాలు చేసిన ఈ పిటిషన్ బ్రిటిష్ పార్లమెంట్లో చర్చకు రానుంది. హౌజ్ ఆఫ్ కామన్స్లో దీనిపై చర్చించనున్నారు. ఈ పిటిషన్ను ప్రారంభించిన విలియన్ ఒలివర్ మాట్లాడుతూ' మొత్తం 75 శాతం కంటే తక్కువగా నమోదైన ఓటింగ్లో ఈయూ నుంచి వైదొలగడం లేదా కొనసాగడం 60 శాతం కంటే తక్కువ ఉందని.. ఈ నేపథ్యంలో రెండో రిఫరెండాన్ని నిర్వహించి మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఎక్కువ సంఖ్యలో ప్రజలు రెండో రెఫరెండం కోసం తమ పేర్లను నమోదు చేసుకోవడానికి ప్రయత్నించడంతో ఈ పిటిషన్ కోసం ఏర్పాటు చేసిన వెబ్సైట్ ఓ దశలో స్తంభించిపోయింది.
తాజా వార్తలు
- ఇరాన్ తో యుద్ధం..అమెరికా సంచలన ప్రకటన..
- హైదరాబాద్లో అగ్నిప్రమాదం, చార్మినార్ వద్ద ముగ్గురికి గాయాలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!









