వయనాడ్లో గెలుపు పై ప్రియాంకా గాంధీ కీలక వ్యాఖ్యలు
- November 24, 2024
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి, విజయం సాధించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఖాళీ చేసిన వయనాడ్ ఎంపీ స్థానం ఉప ఎన్నికలో ప్రియాంకా గాంధీ 4 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. దీనిపై ప్రియాంకా గాంధీ స్పందించారు.
“వయనాడ్లోని సోదరులు, సోదరీమణులు నాపై ఉంచిన నమ్మకానికి నేను కృతజ్ఞత చెబుతున్నాను. ఈ గెలుపు మీ గెలుపే. మీకు ప్రాతినిధ్యం వహించడానికి మీరు ఎన్నుకున్న నేను మీ ఆశలు, కలలను అర్థం చేసుకుంటాను.. మీ కోసం పోరాడతారు. పార్లమెంట్లో మీ గొంతు వినిపించేందుకు నేను ఎదురుచూస్తున్నాను.
నాకు ఈ గౌరవం ఇచ్చినందుకు, మీరు నాపై చూపిన అపారమైన ప్రేమకు ధన్యవాదాలు” అని అన్నారు. యూడీఎఫ్ కూటమిలోని వారు, కార్మికులు, వాలంటీర్లు ఈ ప్రచారంలో చాలా కష్టపడి పనిచేసిన వారికి కృతజ్ఞతలు చెబుతున్నానని తెలిపారు. సోనియా గాంధీ, రాబర్ట్ వాద్రా, రైహాన్, మిరాయా ఇచ్చిన ప్రేమ, ధైర్యానికి ఏ కృతజ్ఞతా సరిపోదని పేర్కొన్నారు.
తన సోదరుడు రాహుల్ అందరికంటే ధైర్యవంతుడని చెప్పారు. తనకు దారి చూపినందుకు, ఎల్లప్పుడూ తన వెన్నంటే ఉంటున్నందుకు ధన్యవాదాలని అన్నారు. ప్రియాంకా గాంధీకి ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల సహా పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- పర్యాటకులకు ఇష్టమైన ఈద్ విహార కేంద్రంగా ఒమన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!









