వయనాడ్లో గెలుపు పై ప్రియాంకా గాంధీ కీలక వ్యాఖ్యలు
- November 24, 2024
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి, విజయం సాధించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఖాళీ చేసిన వయనాడ్ ఎంపీ స్థానం ఉప ఎన్నికలో ప్రియాంకా గాంధీ 4 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. దీనిపై ప్రియాంకా గాంధీ స్పందించారు.
“వయనాడ్లోని సోదరులు, సోదరీమణులు నాపై ఉంచిన నమ్మకానికి నేను కృతజ్ఞత చెబుతున్నాను. ఈ గెలుపు మీ గెలుపే. మీకు ప్రాతినిధ్యం వహించడానికి మీరు ఎన్నుకున్న నేను మీ ఆశలు, కలలను అర్థం చేసుకుంటాను.. మీ కోసం పోరాడతారు. పార్లమెంట్లో మీ గొంతు వినిపించేందుకు నేను ఎదురుచూస్తున్నాను.
నాకు ఈ గౌరవం ఇచ్చినందుకు, మీరు నాపై చూపిన అపారమైన ప్రేమకు ధన్యవాదాలు” అని అన్నారు. యూడీఎఫ్ కూటమిలోని వారు, కార్మికులు, వాలంటీర్లు ఈ ప్రచారంలో చాలా కష్టపడి పనిచేసిన వారికి కృతజ్ఞతలు చెబుతున్నానని తెలిపారు. సోనియా గాంధీ, రాబర్ట్ వాద్రా, రైహాన్, మిరాయా ఇచ్చిన ప్రేమ, ధైర్యానికి ఏ కృతజ్ఞతా సరిపోదని పేర్కొన్నారు.
తన సోదరుడు రాహుల్ అందరికంటే ధైర్యవంతుడని చెప్పారు. తనకు దారి చూపినందుకు, ఎల్లప్పుడూ తన వెన్నంటే ఉంటున్నందుకు ధన్యవాదాలని అన్నారు. ప్రియాంకా గాంధీకి ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల సహా పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







