సివిల్ ఏవియేషన్ లో బహ్రెయిన్ –యూఏఈ ఒప్పందం..!!
- November 26, 2024
మనామా: సివిల్ ఏవియేషన్ లో బహ్రెయిన్ –యూఏఈ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవడానికి బహ్రెయిన్ రవాణా, టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన పౌర విమానయాన వ్యవహారాలు (CAA).. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (GCAA) ఒక అవగాహన ఒప్పందం (MOU)పై సంతకం చేశాయి. ఈ ప్రాంతంలో సివిల్ ఏవియేషన్ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఈ ఒప్పందం దోహదం చేస్తుందనిబహ్రెయిన్ రవాణా మంత్రి డా. షేక్ అబ్దుల్లా అన్నారు. ఈ భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో బహ్రెయిన్కు చెందిన హిజ్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, యూఏఈ ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కీలక భూమిక వహించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్ ప్రధాన మంత్రి అయిన హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా, యూఏఈ వైస్ ప్రెసిడెంట్ ప్రధాన మంత్రి హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.
పౌర విమానయాన సహకారాన్ని బలోపేతం చేయడంలో, ఏవియేషన్ రంగంలో ప్రపంచ అత్యుత్తమ పద్ధతులను అవలంబించడంలో ఈ ఒప్పందం కీలక మైలురాయిగా పరిగణించబడుతుందన్నారు. పౌర విమానయానంలో మహిళలకు మద్దతు ఇవ్వాలనే నిబద్ధతను కూడా ఎంఓయూ హైలైట్ చేస్తుందని, ఈ రంగంలో కొత్త టెక్నాలజీని పరస్పరం పంచుకోనున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







