10 కొత్త మార్గాలను ప్రకటించిన ఎతిహాద్..!!
- November 26, 2024
యూఏఈ: అబుదాబిని ప్రధాన ఆసియా పసిఫిక్ నగరాలతో కలుపుతూ వచ్చే ఏడాది ప్రవేశపెట్టనున్న 10 కొత్త గమ్యస్థానాలను ఎతిహాద్ ప్రకటించింది. జూలై 2025 నుండి ప్రారంభమయ్యే కొత్త రూట్లలో అట్లాంటా, తైపీ, మెడాన్, నమ్ పెన్, క్రాబీ, టునిస్, చియాంగ్ మాయి, హాంకాంగ్, హనోయి, అల్జీర్స్ ఉన్నాయి. యూఏఈకి ఈ దేశాల నుండి వచ్చే పర్యాటకులు, ప్రజల సంఖ్య పెరుగుతున్నందున కొత్త ప్రదేశాలను ఎంపిక చేసినట్టు ఎతిహాద్ తెలిపింది. కొత్త సర్వీసుల ప్రారంభంతో ఈ నగరాలకు యూఏఈ నుండి మాది మాత్రమే నాన్స్టాప్ ఫ్లైట్ అవుతుందని ఎతిహాద్లోని రెవిన్యూ, కమర్షియల్ ఆఫీసర్ అరిక్ డి చీఫ్ అన్నారు.
చాలా విమానాలు యూరప్కి కనెక్ట్ అయ్యేలా ఆప్టిమైజ్ చేసినట్టు తెలిపారు. హనోయి (వియత్నాం) నుండి పారిస్కు వెళ్లాలనుకుంటే, ఈ ప్రాంతంలోని ఇతర విమానయాన సంస్థల కంటే ఎతిహాద్ వేగవంతమైన కనెక్టివిటీని కలిగి ఉందన్నారు. ట్యునీషియా, అల్జీరియన్ రాజధానులకు విమానాలను ప్రవేశపెట్టడం వలన ఈ దేశాల నుండి వేలాది మంది నివాసితులకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. నవంబర్ 1న ట్యూనిస్కు మూడు వీక్లీ విమానాలు, నవంబర్ 7న అల్జీర్స్కు నాలుగు వీక్లీ విమానాలు ప్రారంభమవుతాయన్నారు. జూలై 2 నుండి అట్లాంటాకు నాలుగు వీక్లీ విమానాలు ప్రారంభం అవుతుందన్నారు. న్యూయార్క్, వాషింగ్టన్, చికాగో, ఇటీవల బోస్టన్ తర్వాత ఎతిహాడ్ నేరుగా ప్రయాణించే ఐదవ అమెరికా గమ్యస్థానంగా అట్లాంటా అవుతుందన్నారు.
తాజా వార్తలు
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి







