10 కొత్త మార్గాలను ప్రకటించిన ఎతిహాద్..!!
- November 26, 2024
యూఏఈ: అబుదాబిని ప్రధాన ఆసియా పసిఫిక్ నగరాలతో కలుపుతూ వచ్చే ఏడాది ప్రవేశపెట్టనున్న 10 కొత్త గమ్యస్థానాలను ఎతిహాద్ ప్రకటించింది. జూలై 2025 నుండి ప్రారంభమయ్యే కొత్త రూట్లలో అట్లాంటా, తైపీ, మెడాన్, నమ్ పెన్, క్రాబీ, టునిస్, చియాంగ్ మాయి, హాంకాంగ్, హనోయి, అల్జీర్స్ ఉన్నాయి. యూఏఈకి ఈ దేశాల నుండి వచ్చే పర్యాటకులు, ప్రజల సంఖ్య పెరుగుతున్నందున కొత్త ప్రదేశాలను ఎంపిక చేసినట్టు ఎతిహాద్ తెలిపింది. కొత్త సర్వీసుల ప్రారంభంతో ఈ నగరాలకు యూఏఈ నుండి మాది మాత్రమే నాన్స్టాప్ ఫ్లైట్ అవుతుందని ఎతిహాద్లోని రెవిన్యూ, కమర్షియల్ ఆఫీసర్ అరిక్ డి చీఫ్ అన్నారు.
చాలా విమానాలు యూరప్కి కనెక్ట్ అయ్యేలా ఆప్టిమైజ్ చేసినట్టు తెలిపారు. హనోయి (వియత్నాం) నుండి పారిస్కు వెళ్లాలనుకుంటే, ఈ ప్రాంతంలోని ఇతర విమానయాన సంస్థల కంటే ఎతిహాద్ వేగవంతమైన కనెక్టివిటీని కలిగి ఉందన్నారు. ట్యునీషియా, అల్జీరియన్ రాజధానులకు విమానాలను ప్రవేశపెట్టడం వలన ఈ దేశాల నుండి వేలాది మంది నివాసితులకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. నవంబర్ 1న ట్యూనిస్కు మూడు వీక్లీ విమానాలు, నవంబర్ 7న అల్జీర్స్కు నాలుగు వీక్లీ విమానాలు ప్రారంభమవుతాయన్నారు. జూలై 2 నుండి అట్లాంటాకు నాలుగు వీక్లీ విమానాలు ప్రారంభం అవుతుందన్నారు. న్యూయార్క్, వాషింగ్టన్, చికాగో, ఇటీవల బోస్టన్ తర్వాత ఎతిహాడ్ నేరుగా ప్రయాణించే ఐదవ అమెరికా గమ్యస్థానంగా అట్లాంటా అవుతుందన్నారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









