14వ కటారా ట్రేడిషనల్ ధోవ్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- November 28, 2024
దోహా: అమీర్ హెచ్హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ ఆధ్వర్యంలో 14వ కటారా సాంప్రదాయ ధోవ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. కటారా కల్చరల్ విలేజ్ ఫౌండేషన్ జనరల్ మేనేజర్ ప్రొఫెసర్ డాక్టర్ ఖలీద్ ఇబ్రహీం అల్ సులైతి ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో HE షేక్ ఫైసల్ బిన్ ఖాసిమ్ అల్ థానీ, వివిధ దేశాల రాయబారులు పాల్గొన్నారు. ఈ ఫెస్టివల్ ఖతార్ నిర్వహించే అత్యంత ముఖ్యమైన వారసత్వ పండుగలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ సంవత్సరం ఇది అనేక గల్ఫ్, అరబ్ తోపాటు స్నేహపూర్వక దేశాలను ఒకచోట చేర్చింది. ధౌ ఫెస్టివల్ కార్యకలాపాలు డిసెంబర్ 7 వరకు మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కొనసాగుతాయి.
ఈ సందర్భంగా కటారా జనరల్ మేనేజర్ అల్ సులైతి మాట్లాడుతూ.. ఖతారీ, గల్ఫ్ సముద్ర వారసత్వాన్ని పురస్కరించుకుని, కొత్త తరాలకు సాంస్కృతిక గుర్తింపు కటారా సాంప్రదాయ ధో ఉత్సవం ద్వారా అందుతుందన్నారు. ఇది గతంలో మన దైనందిన జీవితంలో ముఖ్యమైన సముద్ర సంప్రదాయాలను హైలైట్ చేస్తుందని తెలిపారు. ఈ సంవత్సరం ఉత్సవంలో ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, సుల్తానేట్ ఆఫ్ ఒమన్, కువైట్, ఇరాక్, ఇండియా, టాంజానియా, ఇరాన్, పాలస్తీనా వంటి 11 దేశాలు పాల్గొంటున్నాయని తెలిపారు. ఈ ఫెస్టివల్ సందర్భంగా సముద్రంలో "లాబ్రేఖా, "స్వోర్డ్ ఫిషింగ్ కాంపిటీషన్", "పెర్ల్ డైవింగ్","రోయింగ్", "సెన్యార్ ఫ్యామిలీ కాంపిటీషన్" వంటి సముద్ర పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







