14వ కటారా ట్రేడిషనల్ ధోవ్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- November 28, 2024
దోహా: అమీర్ హెచ్హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ ఆధ్వర్యంలో 14వ కటారా సాంప్రదాయ ధోవ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. కటారా కల్చరల్ విలేజ్ ఫౌండేషన్ జనరల్ మేనేజర్ ప్రొఫెసర్ డాక్టర్ ఖలీద్ ఇబ్రహీం అల్ సులైతి ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో HE షేక్ ఫైసల్ బిన్ ఖాసిమ్ అల్ థానీ, వివిధ దేశాల రాయబారులు పాల్గొన్నారు. ఈ ఫెస్టివల్ ఖతార్ నిర్వహించే అత్యంత ముఖ్యమైన వారసత్వ పండుగలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ సంవత్సరం ఇది అనేక గల్ఫ్, అరబ్ తోపాటు స్నేహపూర్వక దేశాలను ఒకచోట చేర్చింది. ధౌ ఫెస్టివల్ కార్యకలాపాలు డిసెంబర్ 7 వరకు మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కొనసాగుతాయి.
ఈ సందర్భంగా కటారా జనరల్ మేనేజర్ అల్ సులైతి మాట్లాడుతూ.. ఖతారీ, గల్ఫ్ సముద్ర వారసత్వాన్ని పురస్కరించుకుని, కొత్త తరాలకు సాంస్కృతిక గుర్తింపు కటారా సాంప్రదాయ ధో ఉత్సవం ద్వారా అందుతుందన్నారు. ఇది గతంలో మన దైనందిన జీవితంలో ముఖ్యమైన సముద్ర సంప్రదాయాలను హైలైట్ చేస్తుందని తెలిపారు. ఈ సంవత్సరం ఉత్సవంలో ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, సుల్తానేట్ ఆఫ్ ఒమన్, కువైట్, ఇరాక్, ఇండియా, టాంజానియా, ఇరాన్, పాలస్తీనా వంటి 11 దేశాలు పాల్గొంటున్నాయని తెలిపారు. ఈ ఫెస్టివల్ సందర్భంగా సముద్రంలో "లాబ్రేఖా, "స్వోర్డ్ ఫిషింగ్ కాంపిటీషన్", "పెర్ల్ డైవింగ్","రోయింగ్", "సెన్యార్ ఫ్యామిలీ కాంపిటీషన్" వంటి సముద్ర పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







