దుబాయ్ లో సలిక్ టోల్ రేట్లు, పార్కింగ్ ధరలు..ప్రకటించిన ఆర్టీఏ..!!
- November 29, 2024
దుబాయ్: దుబాయ్ నగరంలో ట్రాఫిక్ ప్లోను పెంచే సమగ్ర వ్యూహం అమల్లోకి రానుంది. ఇందులో భాగంగా వేరియబుల్ రోడ్ టోల్ ప్రైసింగ్ (సాలిక్), వేరియబుల్ పార్కింగ్ టారిఫ్ విధానాలను అమలు చేయనున్నట్లు దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. వేరియబుల్ రోడ్ టోల్ ప్రైసింగ్ (సాలిక్) సిస్టమ్ జనవరి 2025 చివరిలో ప్రారంభించబడుతుందని, వాహనదారులకు ఉదయం 1 నుండి ఉదయం 6 గంటల మధ్య టోల్-ఫ్రీ ప్రయాణాన్ని అందిస్తుందని తెలిపారు.
ఇక వీకెండ్లలో ఉదయం పీక్ అవర్స్ (ఉదయం 6 నుండి 10 గంటల వరకు), సాయంత్రం పీక్ అవర్స్ (సాయంత్రం 4 నుండి రాత్రి 8 వరకు) సమయంలో టోల్ 6 దిర్హామ్లుగా నిర్ణయించారు. రద్దీ లేని సమయాలలో ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల మధ్య మరియు రాత్రి 8 నుండి తెల్లవారుజామున 1 గంటల వరకు, టోల్ 4 దిర్హామ్లుగా ఉంటుంది. ఆదివారాలు, ప్రభుత్వ సెలవులు, ప్రత్యేక సందర్భాలు లేదా ప్రధాన ఈవెంట్లు మినహా రోజంతా టోల్ Dh4 ఉంటుంది.
వేరియబుల్ పార్కింగ్ టారిఫ్ పాలసీ మార్చి 2025 చివరి నాటికి అమల్లోకి రానుంది. ఇందులో ప్రీమియం పార్కింగ్ స్థలాలకు గంటకు Dh6, ఉదయం పీక్ అవర్స్ (ఉదయం 8 నుండి 10వరకు), సాయంత్రం పీక్ అవర్స్(సాయంత్రం 4 నుండి రాత్రి 8 వరకు)లో ఇతర పబ్లిక్ పెయిడ్ పార్కింగ్ స్థలాలకు గంటకు Dh4 చొప్పున పార్కింగ్ రుసుమును నిర్ణయించారు. రద్దీ లేని సమయాలు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు, రాత్రి 8 నుండి 10 గంటల వరకు రుసుములు మారవు. రాత్రి 10 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు, ఆదివారం రోజంతా పార్కింగ్ ఉచితం అని ప్రకటించారు.
రద్దీ ధరల విధానం
ఈవెంట్ ప్రాంతాల కోసం రద్దీ ధరల విధానం ఈవెంట్ జోన్లకు సమీపంలో పబ్లిక్ పెయిడ్ పార్కింగ్ స్థలాలకు గంటకు Dh25 రుసుమును వసూలు చేయనున్నారు. 2025 ఫిబ్రవరి నుండి ప్రారంభమయ్యే ప్రధాన ఈవెంట్ల నుండి ఈ విధానం అమల్లోకి రానుంది. మొదట దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ చుట్టూ అమలు చేయనున్నట్లు అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









