ఫోర్జరీ సాలరీ సర్టిఫికేట్లతో లోన్ స్కామ్..నిందితులు అరెస్ట్..!!
- December 03, 2024
మనామా: వ్యక్తిగత రుణాలు పొందడానికి ప్రభుత్వ పత్రాలను నకిలీ చేసినందుకు ముగ్గురు ఆసియా వ్యక్తులపై ఫోర్జరీ, మోసం అభియోగాలను నమోదు చేశారు. ప్రధాన నిందితుడు, అతని ఇద్దరు సహచరులు. బహ్రెయిన్ ప్రభుత్వ ఏజెన్సీకి సెక్యూరిటీ గార్డులుగా పనిచేశారు. ఒక్కొక్కరు BD39,000 కంటే ఎక్కువ రుణాలు పొందేందుకు వారి జీతాలను పెంచి చూపారని అభియోగాలు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. నిందితులు మరో వ్యక్తితో కలిసి సాలరీ సర్టిఫికేట్లు, బ్యాంక్ స్టేట్మెంట్ల వంటి అధికారిక పత్రాలను ఫోర్జరీ చేశారని ప్రాసిక్యూషన్ పేర్కొంది. వీటిని నిందితులు రుణాలు పొందేందుకు ఈ నకిలీ పత్రాలను ఉపయోగించారని తెలిపారు.
సెక్యూరిటీ గార్డులు కూడా బ్యాంకు ప్రతినిధితో కలిసి ఈ నేరాలకు పాల్పడినట్లు అభియోగాలు మోపారు. అసాధారణంగా అధిక జీతాలు క్లెయిమ్ చేస్తూ అనేక మంది వ్యక్తుల నుండి రుణ దరఖాస్తులలో అసమానతలను బ్యాంక్ సేల్స్ మేనేజర్ గమనించిన సమయంలో ఈ స్కామ్ గురించి బయటపడింది. సంబంధిత ప్రభుత్వ యంత్రాంగంతో తనిఖీ చేయగా, ఫోర్జరీ వ్యవహారం బయటపడింది. ఒక్కొక్కరి జీతాలను BD255 నుండి BD2,000కి పెంచినట్టు గుర్తించారు. ఇందు కోసం అనధికార సంతకాలు, ఒరిజినల్ డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసినట్టు బ్యాంకు అధికారులు ధృవీకరించారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









