ఫోర్జరీ సాలరీ సర్టిఫికేట్లతో లోన్ స్కామ్..నిందితులు అరెస్ట్..!!
- December 03, 2024
మనామా: వ్యక్తిగత రుణాలు పొందడానికి ప్రభుత్వ పత్రాలను నకిలీ చేసినందుకు ముగ్గురు ఆసియా వ్యక్తులపై ఫోర్జరీ, మోసం అభియోగాలను నమోదు చేశారు. ప్రధాన నిందితుడు, అతని ఇద్దరు సహచరులు. బహ్రెయిన్ ప్రభుత్వ ఏజెన్సీకి సెక్యూరిటీ గార్డులుగా పనిచేశారు. ఒక్కొక్కరు BD39,000 కంటే ఎక్కువ రుణాలు పొందేందుకు వారి జీతాలను పెంచి చూపారని అభియోగాలు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. నిందితులు మరో వ్యక్తితో కలిసి సాలరీ సర్టిఫికేట్లు, బ్యాంక్ స్టేట్మెంట్ల వంటి అధికారిక పత్రాలను ఫోర్జరీ చేశారని ప్రాసిక్యూషన్ పేర్కొంది. వీటిని నిందితులు రుణాలు పొందేందుకు ఈ నకిలీ పత్రాలను ఉపయోగించారని తెలిపారు.
సెక్యూరిటీ గార్డులు కూడా బ్యాంకు ప్రతినిధితో కలిసి ఈ నేరాలకు పాల్పడినట్లు అభియోగాలు మోపారు. అసాధారణంగా అధిక జీతాలు క్లెయిమ్ చేస్తూ అనేక మంది వ్యక్తుల నుండి రుణ దరఖాస్తులలో అసమానతలను బ్యాంక్ సేల్స్ మేనేజర్ గమనించిన సమయంలో ఈ స్కామ్ గురించి బయటపడింది. సంబంధిత ప్రభుత్వ యంత్రాంగంతో తనిఖీ చేయగా, ఫోర్జరీ వ్యవహారం బయటపడింది. ఒక్కొక్కరి జీతాలను BD255 నుండి BD2,000కి పెంచినట్టు గుర్తించారు. ఇందు కోసం అనధికార సంతకాలు, ఒరిజినల్ డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసినట్టు బ్యాంకు అధికారులు ధృవీకరించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







