మంగళవారం నుండి ఈయూ నుంచి బ్రిటన్ విడిపోయే ప్రక్రియ మొదలు
- June 26, 2016
ఈయూ నుంచి విడిపోయే ప్రక్రియను మంగళవారం నుంచి మొదలుపెట్టండని బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్కు సూచించింది యురోపియన్ యూనియన్ పార్లమెంట్. ప్రక్రియ ఆలస్యమయ్యేకొద్దీ అభద్రతాభావం పెరిగిపోతుందని, ఉద్యోగాలపై ప్రభావం చూపిస్తుందని మార్టిన్ షుల్జ్ అన్నారు. పార్టీ విధివిధానాల రూపకల్పన కోసం మొత్తం ప్రక్రియను మొదలుపెట్టడానికి వెనకాముందు కావడం అందరికీ నష్టం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. అందుకే ఈయూ సదస్సు మొదలయ్యే మంగళవారం నుంచే విడాకుల ప్రక్రియ మొదలుపెట్టాలని సూచించారు. యురోపియన్ పార్లమెంట్లోని నాలుగు మేజర్ గ్రూప్స్ ఈ మేరకు ఓ ముసాయిదా తీర్మానం చేశాయి. యూనియన్ సమగ్రతను కాపాడేందుకు, అనిశ్చితికి తెరదించేందుకు ఇది తోడ్పడుతుందని ఈయూ అభిప్రాయపడింది. అయితే ఈ ప్రక్రియను ప్రారంభించాలంటే లిస్బన్ ఒప్పందంలోని ఆర్టికల్ 50ని బ్రిటన్ ప్రయోగించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ముందు యూరో కౌన్సిల్కు బ్రిటన్ తమ నిర్ణయం చెబితే వారు రెండేళ్ల సంప్రదింపుల ప్రక్రియను మొదలుపెడతారు. బ్రెగ్జిట్ నేపథ్యంలో మంగళ, బుధవారాల్లో ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది యూరో కౌన్సిల్.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







