ముస్లిం సోదరులకు ప్రత్యేక సంక్షేమ పథకాలు
- June 26, 2016
రాష్ట్రంలో ముస్లింల సంక్షేమం కోసం అనేక పథకాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. నిజాం కళాశాల గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సీఎం మాట్లాడారు. ఈ ఏడాది 120 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభిస్తున్నామని చెప్పారు. మైనార్టీల రిజర్వేషన్ల కోసం కమిటీ వేశామన్నారు. కమిటీ నివేదిక రాగానే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి తీర్మానాన్ని ఢిల్లీకి పంపుతామని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధఃగా మైనార్టీలకు అధిక నిధులు కేటాయించామని గుర్తు చేశారు. ఇఫ్తార్ విందులో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, రాజ్యసభ సభ్యులు కే కేశవరావు, డి. శ్రీనివాస్, ఏసీబీ డీజీ ఏకే ఖాన్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







