సౌదీలో మొదటి హైడ్రోజన్ బస్సు టెస్ట్ డ్రైవ్ ప్రారంభం..!!
- December 06, 2024
అల్-అహ్సా: సౌదీ అరేబియాలో హైడ్రోజన్తో నడిచే మొట్టమొదటి బస్సు ట్రయల్ రన్ను అల్-అహ్సా గవర్నర్ ప్రిన్స్ సౌద్ బిన్ తలాల్ బిన్ బదర్ ప్రారంభించారు. ఈ బస్సు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 635 కిలోమీటర్ల వరకు ప్రయాణించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. 45 మంది ప్రయాణికులు ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఇది దమ్మామ్ నగరం-అల్-అహ్సా గవర్నరేట్ మధ్య నడుస్తుంది. SATCO సంస్థ ద్వారా నడిచే ఇది రోజులో మొత్తం 359 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో రవాణా, లాజిస్టిక్స్ డిప్యూటీ మంత్రి, రవాణా జనరల్ అథారిటీ (TGA) తాత్కాలిక అధ్యక్షుడు డా. రుమైహ్ అల్-రుమైహ్ పాల్గొన్నారు. ప్రారంభోత్సవ వేడుకలో ప్రిన్స్ సౌద్ హైడ్రోజన్ బస్సుల ఆపరేషన్, ఇంధనం నింపే ప్రక్రియ, వాటి భద్రతా ప్రమాణాలు, కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో సహకారం గురించి వివరించే వీడియోను వీక్షించారు.
సౌదీ విజన్ 2030 సాధించడంలో రాజ్యంలో మొట్టమొదటి హైడ్రోజన్-శక్తితో నడిచే బస్సును అల్-అహ్సాలో ప్రారంభించడం ఒక ముఖ్యమైన అడుగు అని ప్రిన్స్ సౌద్ అన్నారు. ఇది పర్యావరణ స్థిరత్వం, పర్యావరణ అనుకూల సాంకేతికతలను ప్రోత్సహించడంపై దృష్టి సారిస్తుందని, అల్-అహ్సా నివాసితులు, సందర్శకుల కోసం జీవన నాణ్యతను మెరుగుపరుస్తుందని సంతోషం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









